పరగడుపున జ్యూస్ తాగుతున్నారా? అయితే ముప్పే!

Purushottham Vinay
చాలా మంది కూడా ఎక్కువగా ఖాళీ కడుపుతో జ్యూస్ తాగుతుంటారు. ఇక అలాగే డైట్ చేసే వారి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బరువు తగ్గడానికి వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మానేసి ఏదో ఒక జ్యూస్ ని తాగుతుంటారు.అయితే ఇక ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. మార్నింగ్ టైంలో జ్యూస్ తాగడం వలన జీర్ణవ్యవస్థలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక అంతే కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో చల్లని జ్యూస్ తాగడం వలన శ్లేష్మ పొరలు అనేవి దెబ్బతింటాయి. అందుకే ఉదయం పూట నిద్రలేచిన వెంటనే జ్యూస్ తాగే అలవాటును మార్చుకుని కాస్త ఆహారం తీసుకున్న తర్వాత జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. ఇది మీకు పూర్తి పోషకాహారాన్ని కూడా అందిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా చెబుతున్నారు. అందువలన వీలైనంత వరకు కూడా బ్రేక్ ఫాస్ట్ మానేసి జ్యూస్ తాగకపోవడమే చాలా బెటర్ అంటున్నారు.


ఇక కొన్ని నివేదికల ప్రకారం, నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం పూట తాగడం మానుకోవాలి.ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ కడుపులో ఆమ్లత్వం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అయితే, ఇది అందరికీ కూడా హానికరం కాదు. తాజా పండ్ల రసం తాగడం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ప్రయోజనకరంగా కూడా పరిగణించబడుతుంది.అయితే ఇక ఇది కొన్ని ప్రతికూలతలను కూడా కలిగి ఉంటుంది.అయితే, జ్యూస్‌లో శరీరానికి అవసరమైన విటమిన్లు ఇంకా అలాగే మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. చాలా మంది ఉదయాన్నే జ్యూస్‌తో ప్రారంభించడానికి కారణం కూడా ఇదే.కాబట్టి జ్యూస్ ని బ్రేక్ ఫాస్ట్ తరువాత తాగడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: