కరోనా : తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్నంటే..?
ఇక గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పయినట్టు బులెటిన్లో పేర్కొన్నారు. దీంతో మృతుల సంఖ్య 4,036 వరకు చేరింది. కరోనా నుంచి బుధవారం 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,847 ఐసోలేషన్, యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో తెలిపారు. ఇక ఒమిక్రాన్ కేసులపై వైద్యారోగ్యశాఖ ఇంకా ఏ వివరాలను వెల్లడించలేదు. పెరుగుతున్న నేపథ్యంలో అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కరోనా థర్డ్వేవ్ మొదలైందని డీహెచ్ శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నమోదయ్యే కేసుల్లో తీవ్ర ప్రభావం ఏమి లేదని, ఆసుపత్రులలో ఎక్కడ ఎక్కువ సంఖ్యలో రోగులు చేరడం లేదని తెలిపారు.
ఒమిక్రాన్ బారిన పడిన వారు కూడా 5 రోజుల్లోనే కోలుకుంటున్నారు అని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటిచామన్నారు. ఇక సంక్రాంతికి కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాద ఉందని డీహెచ్ హెచ్చరించారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వచ్చే నాలుగు వారాల పాటు అన్నీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ వైద్యారోగ్య శాఖకు సహకరిస్తే ఫిబ్రవరి నెలలో మళ్లీ కేసులు తగ్గే అవకాశం ఉన్నదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతీ ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించి, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకుంటూ.. కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.