యాపిల్: ఆ సమయంలో తింటే ఇబ్బందులు తప్పవు?

Purushottham Vinay
యాపిల్ పండ్లను తింటే డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిన పని లేదు అంటారు. నిజమే.. ఎందుకంటే దీన్ని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. జీర్ణ సమస్యలు ఉండవు. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ ఇంకా మలబద్దకం వంటివి తగ్గుతాయి. యాపిల్ పండ్లను తింటే కడుపు నిండిన భావన కూడా మీకు కలుగుతుంది. దీంతో ఆహారం కూడా తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు చాలా బాగా సహాయపడుతుంది. ఇక యాపిల్ పండ్లను తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ ఆహారాన్ని చాలా నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ కూడా ఒక్కసారిగా పెరగవు. అలాగే షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. అప్పుడు డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.యాపిల్ పండ్లను తినడం వల్ల రక్తం చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. యాపిల్ పండ్లను తింటే గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.


హార్ట్ ఎటాక్‌లు అనేవి రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. జ్వరం వచ్చిన వారు యాపిల్ పండ్లను తింటే చాలా త్వరగా కోలుకుంటారు. ఇలా యాపిల్ పండ్లను తినడం వల్ల మనం చాలా రకాల లాభాలను పొందవచ్చు. అయితే యాపిల్ పండ్లను కొంతమంది రాత్రి పూట తింటుంటారు. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా వీటిని రాత్రి పూట తినవద్దని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే యాపిల్ పండ్లలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే త్వరగా జీర్ణం కావు. జీర్ణం అయ్యేందుకు కూడా సమయం పడుతుంది. అలాంటిది ఈ పండ్లను రాత్రి పూట తింటే జీర్ణ వ్యవస్థ పనులకు ఖచ్చితంగా ఆటంకం ఏర్పడుతుంది. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదు. దీంతో గ్యాస్‌, అజీర్ణం ఇంకా మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.కాబట్టి రాత్రి పూట ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పండ్లను తినకూడదు. ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తినాలి. సాయంత్రం  అయితే వీటిని అసలు తినరాదు. తింటే  చాలా ఇబ్బందులు పడతాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: