ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా? అయితే ఆరోగ్యానికి ముప్పే!

Purushottham Vinay
ఎండలు భగ భగ మండిపోతున్నాయి. భగభగలాడే సూర్యుడి వేడిని తట్టుకోలేక చాలామంది కూడా ఈ సీజన్‌లో ఫ్రిడ్జ్ వాటర్‌ను ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఈ ఫ్రిడ్జ్ వాటర్ ని ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.గొంతు ఇన్ఫెక్షన్లు ఇంకా అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులు ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే కడుపు సంబంధిత వ్యాధులతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తవచ్చునని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ చెబుతున్నారు.ఫ్రిడ్జ్ వాటర్ ఆ సమయానికి మీ దాహాన్ని తీర్చినా కాని అది శరీరంలోని వేడిని చాలా ఎక్కువ చేస్తుందని వైద్యులు అంటున్నారు. అందుకే దాహం తీర్చుకోవడానికి కాచి చల్లార్చిన నీటిని తాగమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే వేసవిలో వేడి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగ ఇంకా అలాగే కొబ్బరి నీళ్లని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని.. ఇవి శరీరానికి కావాల్సిన ఖనిజాలను అందించడంలో బాగా సహాయపడతాయని వైద్యులు అంటున్నారు.


అలాగే చక్కెరతో కూడిన పండ్ల రసాలకు దూరంగా ఉండమని కూడా ఆరోగ్య నిపుణులు చాలా సీరియస్ గా చెబుతున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ కి బదులుగా మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మట్టి కుండలో నీరు చల్లగా ఉండటనే కాకుండా మీ దాహాన్ని తీర్చి మీకు మానసిక ప్రశాంతతను కలుగ జేస్తాయని డాక్టర్స్ తెలుపుతున్నారు.ఇక తాజా పండ్ల రసాలను ఆస్వాదించేటప్పుడు.. చక్కెర ఇంకా ఐస్‌ను ఖచ్చితంగా తప్పించండి. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని డైట్‌లో చేర్చాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు ఇంకా పులుపు తక్కువున్న పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు. దోసకాయ, పొట్లకాయ, కీరా దోసకాయలు, జాక్‌ఫ్రూట్, మామిడి, పుచ్చకాయ ఇంకా అలాగే అరటి పండ్లు లాంటివి ఈ సీజన్‌లో తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: