కంటి చూపు తగ్గుతోందా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Divya
ఆనాటి కాలంలో అయితే పెద్దవారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కంటిచూపు క్రమంగా మందగిస్తూ వచ్చేది. కానీ నేటి కాలంలో ఐదు సంవత్సరాల పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా కంటిచూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. అందుకు కారణం చిన్నపిల్లలైతే మరీ ఎక్కువగా సెల్ ఫోన్స్ చూడడం , టీవీ లాంటివి ఎక్కువగా చూడడం వల్ల తమ కంటి చూపును తగ్గించుకుంటున్నారు. ఇక తీసుకునే ఆహారంలో తగినన్ని పోషకాల లోపం వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా యువతకు అయితే ఈ మధ్య కాలంలో చాలామంది కంటి చూపు మందగిస్తుంది అని హాస్పిటల్స్ చుట్టూ తిరిగే వారి సంఖ్య ఎక్కువవుతోంది.

ఇక కంప్యూటర్ ముందు ఉద్యోగం చేసే వారికి ఈ కంటి చూపు సమస్య ఎక్కువ అవుతుందని పలువురు బాధితులు వాపోతున్నారు. అయితే కంటిచూపు సమస్యను తగ్గించుకోవాలి అంటే భోజనం చేసిన తర్వాత ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. కంటి చూపు పెరుగుతుంది అని వైద్యులు చెబుతున్నారు. ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందాం. సహజంగా మనం భోజనం చేయడానికి ఏదైనా హోటల్ కు , రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత కచ్చితంగా మనకు సోంపు గింజలు ఇవ్వడం అయితే జరుగుతుంది . అయితే భోజనం చేసిన తర్వాత ఎందుకు తీస్తారు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం బహుశా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు.
సోంపు గింజలలో ఎక్కువగా పొటాషియం, యాంటీ  ఆక్సిడెంట్లు,జింక్, క్యాల్షియం, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ సోంపు గింజలను భోజనం చేసిన ప్రతి సారి తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగు పరచడంతో పాటు ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే దూరమవుతాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వచ్చే జలుబు , దగ్గు వంటి సమస్యలను ఈ సోంపు గింజలు తిని ఇట్టే దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: