పరుగులు పెడుతున్న పుత్తడి.. అదే దారిలో వెండి..!!

Satvika
దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న స్థిరంగా వున్న బంగారం ధరలు సాయంత్రానికి భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,160 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. రూ.46,170గా ఉంది. ఇదిలా ఉంటే. దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.. నిన్నటి రేటుతో పోలిస్తే ఈరోజు ధరలు కాస్త పైకి కదిలాయి...


గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేట్లు పెరగడం ఇందుకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌ లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదల తో రూ.48,270కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.90 పెరుగుదలతో రూ.44,250కు ఎగసింది.


బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.500 పెరుగుదలతో రూ.74,200కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం తో వెండి ధరలకు రెక్కలు వచ్చాయని నిపుణులు అంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ ‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌ కు 0.09 శాతం పెరుగుదలతో 1772 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు కూడా ఇదే దారి లో పయనించింది. ఔన్స్ ‌కు 0.24 శాతం పెరుగుదల తో 25.89 డాలర్ల కు ఎగసింది.. బంగారం ధరల పై అనేక అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. అందుకే ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. 
రోజుకో విధంగా మారుతున్న ఈ ధరలు మరి రేపు ఎలా ఉంటాయో చూడాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: