పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

Satvika
పసిడి ప్రియులకు శుభవార్త.. గత రెండు వారాల నుంచి షాక్ ఇస్తున్న బంగారం ధరలు నిన్న కాస్త ఊరటను కలిగించాయి.. నేటి మార్కెట్ లో ధరలు పూర్తిగా పడిపోయాయి.. ఒక్కసారి మార్కెట్ లో బంగారం ధరలు నేల చూపులు చూసాయి.. క్రిస్టమస్ ,జనవరి కి బంగారం కొనుగోలు చేసేవారికి ఈ రేటు కలిసి వస్తుందని చెప్పాలి.. అంతర్జాతీయ మార్కెట్ బంగారం పై వేటు పడటంతో భారతీయ మార్కెట్ లో తగ్గుముఖం పట్టాయి..బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది..  కొనుగోలు తగ్గడం లేదా మార్కెట్ లో రేట్లు పూర్తిగా కిందకు వస్తుండటంతో ఈ రేట్లు తగ్గినట్లు కనబడుతోంది..



హైదరాబాద్ మార్కెట్ లో చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గింది. రూ.50,830కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 క్షీణతతో రూ.46,600కు దిగింది. ఇక ఈరోజు మార్కెట్ లో వెండి రేటును చూస్తే..ఏకంగా రూ.1,500 పతనమైంది. దీంతో వెండి ధర రూ.70,500 పడి పోయింది.. పరిశ్రమల యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి కొనుగోళ్లు భారీగా తగ్గడం ఇందుకు ముఖ్య కారణం అని మార్కెట్ నిపుణులు అంటున్నారు..


అయితే, బంగారం, వెండి ధరలు అనేవి మార్కెట్ ను బట్టి మారుతుంటాయి..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1881 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 26 డాలర్లకు పైకి కదిలింది.. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన ఈ ధరలు ప్రస్తుతం కిందకు వస్తుండటంతో కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం పెరుగుతుంది.. మరి న్యూయర్ కు రేట్లు భారీగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. జనవరి నుంచి రేట్లు పూర్తిగా పడిపోతాయని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: