స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. అదేబాటలో వెండి..!
గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతూ వచ్చి స్వల్పంగా తగ్గింది. దీంతో పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.20 తగ్గడంతో ధర రూ.52,410కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరగడంతో రూ.48,050కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,440కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,400 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.51,680, 22 క్యారెట్ల ధర రూ.47,380కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,500. 24 క్యారెట్ల ధర రూ.50,750 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఇక వెండి ధర కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి ధర భారీగా తగ్గుముఖం పట్టింది. దేశీయ మార్కెట్ కేజీ వెండి ధర రూ.1800 తగ్గడంతో ధర రూ.62,200కు చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,860కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 తగ్గడంతో రూ.48,900కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.1,800 తగ్గడంతో ధర రూ.62,200కు చేరింది.