కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య సంస్థల్లో 487 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులని కోరుతోంది.న్యూఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై నగరాలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఇక ఆ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 487 పోస్టులను ఆ ఆరోగ్య కేంద్రాల్లో భర్త చేయనున్నారు. రిసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, హెల్త్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ వర్కర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరపిస్ట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్రే టెక్నీషియన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, యానిమల్ అటెండెంట్, లైబ్రరీ క్లర్క్, నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్నర్స్), పారామెడికల్ వర్కర్, వర్క్షాప్ అటెండెంట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక దరఖాస్తు ఫీజు కింద రూ.600 ప్రతిఒక్కరూ చెల్లించాలి. మహిళలకు, ఎసీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు.పరీక్ష విధానం విషయానికి వస్తే..ప్రశ్నపత్రం అనేది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అది ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. ఇందులో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ఇంకా ఒక్కో ప్రశ్నకూ 4 మార్కుల చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ కూడా 1 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మొత్తం 60 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ నవంబర్ 30, 2023 దాకా ఉంటుంది.ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ డిసెంబర్ 01, 2023 దాకా ఉంటుంది.అడ్మిట్కార్డ్ డౌన్లోడింగ్ తేదీ డిసెంబరు మొదటివారం, 2023 నుంచి ఉంటుంది.కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ డిసెంబరు రెండోవారం, 2023లో ఉంటుంది.ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ డిసెంబరు నాలుగోవారం, 2023లో ఉంటుంది.