వారికి చదువు ఆగరాదు : సుప్రీమ్ కోర్టు..

Purushottham Vinay
కరోనా మహమ్మారి ప్రభావంతో తల్లిదండ్రులిద్దరినీ లేదా ఒకరిని కోల్పోయిన చిన్నారుల చదువు మధ్యలోనే ఆగిపోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది.ఈ సంవత్సరం వారి చదువులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీమ్ ఆదేశించడం జరిగింది. ఆ చిన్నారుల ఫీజులు మాఫీ చేయాల్సిందిగా ప్రైవేటు యాజమాన్యాలను కోరాలని సూచించడం జరిగింది. లేదంటే సగం ఖర్చు ప్రభుత్వాలు భరించాలని తెలిపింది. ‘చిన్నారుల సంరక్షణ నిలయాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి’ సుమోటో కేసును గురువారం జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు ఇంకా జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించడం జరిగింది. ఇక దేశంలో మార్చి 2020 నుంచి అనాథలైన లేక తల్లిదండ్రుల్లో ఒకరిని పోగొట్టుకున్న చిన్నారుల విద్యా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొనడం జరిగింది. కనీసం ప్రస్తుత విద్యాసంవత్సరమైనా ఆ చిన్నారుల చదువు కొనసాగేలా చూడాలని సుప్రీమ్ కోర్టు తెలిపడం జరిగింది.

‘ఇక ఈ విద్యా సంవత్సరంలో ఆ చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకం అనేది రాకుండా చూసేలా వారు చదువుతున్న ప్రైవేటు బడుల యాజమాన్యాలతో మాట్లాడటానికి బాలల సంక్షేమ కమిటీలు అలాగే జిల్లా విద్యాశాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా అమికస్‌ క్యూరీ గౌరవ్‌ అగర్వాల్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు పలు సూచనలు చేయడం జరిగింది.కరోనా వైరస్ వల్ల అనాథలైన 221 మంది చిన్నారులకు ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్ట్‌ (ఐసీపీ) స్కీంతో  తెలంగాణ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది.

సోషల్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌ (ఎస్‌ఐఆర్‌) ఆధారంగా 914 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరు కోల్పోయారని ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందని చెప్పడం జరిగింది.‘ఎస్‌ఐఆర్‌ను త్వరగా పూర్తి చేయాలి. మూడు వారాల్లో బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌లో సమాచారం అనేది అప్‌లోడ్‌ చేయాలి..మొత్తం 221 మంది అనాథల్లో 96 మందిని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చడం జరిగింది. ఇక వీరి చదువు పట్ల ప్రభుత్వం సరైన బాధ్యత అనేది తీసుకోవాలి. 914 మంది చిన్నారులని కూడా ప్రైవేటు పాఠశాలల్లో చేర్చాలి’ అని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: