ఇంటర్ పాసైన స్టూడెంట్స్ స్కాలర్ షిప్స్ ఇలా అప్లై చేసుకోండి..

Purushottham Vinay
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. ఇంటర్మీడియెట్‌ పాసైన వారు ఈ ఉపకారవేతనాలకు అర్హులని ఇంటర్మీడియెట్‌ విద్యామండలి తాజాగా ఓ ప్రకటనలో తెలిపడం జరిగింది.నవంబర్‌ 30వ తారీఖు లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొనడం జరిగింది. ఇక గతంలో ఈ ఉపకారవేతనాలకు ఎంపికైన వారు 2021–22 సంవత్సరానికి తమ దరఖాస్తులను పునరుద్ధరించుకోవాలని సూచించడం జరిగింది. ఇక పూర్తి వివరాల గురించి తెలుసుకోవాలంటే https://scholarships.gov.in/ ను ఓపెన్ చేసి చూడొచ్చు.ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌మీడియేట్ విద్యకు సంబంధించి 2021–22 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్‌ బోర్డు అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయడం జరిగింది.

 ఇక దీని ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో మొత్తం కూడా 188 పని రోజులున్నాయి.కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా అడ్మిషన్లు ఇంకా తరగతుల నిర్వహణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులు ఇంకా పరీక్షల నిర్వహణ వంటి ప్రక్రియలపై ఈ క్యాలెండర్‌ రూపొందించడం జరిగింది. సెకండియర్‌ విద్యార్థులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన ఇంటర్మీడియట్ బోర్డు ఈనెల 16 వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.మొదటి సంవత్సరం విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఈ సంవత్సరం ఆన్‌లైన్లో నిర్వహించబోతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీచేసిన బోర్డు ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీని ఆగస్టు 27వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. అలాగే అడ్మిషన్లు పూర్తయిన తరువాత సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి మొదటి సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులకు తరగతులను ప్రారంభించబోతుంది.ఇక ఇంటర్‌ బోర్డు క్యాలెండర్‌ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 47 సెలవుదినాలున్నాయి. అన్ని రెండో శనివారాలు పనిరోజులుగానే ఉంటాయి. టర్మ్‌ సెలవులు అనేవి లేవు. ఇక వేసవి సెలవుల్లో అన్ని యాజమాన్యాల్లోని జూనియర్‌ కాలేజీలను క్లోజ్ చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు అన్ని ఆదివారాలు ఇంకా పబ్లిక్‌ సెలవుదినాలను విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: