పది చదివితే చాలు.. రూ. నెలకు రూ. 13,000 జీతం.. డైరెక్టుగా జాబ్..!

కేవలం పది విద్యార్హత ఉందని బాధపడుతున్నారా.. మీకు కూడా ఉద్యోగం అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా ఉపాధికల్పనా కార్యాలయం ఇలాంటి వారి కోసం ఈరోజు అంటే.. జనవరి 30వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి
లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ఉద్యగం పేరు.. అసిస్టెంట్ సేల్స్ మెన్.. ఈ ఉద్యోగాల భర్తీకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విజయనగర్ర్ కాలనీలోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.


పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఆపై విద్యార్హతలు కలిగి 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత అర్హులని పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 11,465 వేతనంతోపాటు అదనంగా టీఏ, డీఏలు ఉంటాయి.

ఆసక్తిగత నిరుద్యోగులు తమ విద్యార్హత జిరాక్సు ప్రతులతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇంకా వివరాలు కావాలంటే.. 80085 35309, 80085 35312 నంబర్లలో ఫోన్ చేసిన తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: