ప్రైవేట్ కంపెనీల్లో వివిధ పోస్టులకు గాను ఈ నెల 5న మెథోడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హైదరాబాద్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ మేళాలో ఇన్ఫోసిస్, హిందుజా, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంకు, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు, యురేకా ఫోర్బ్స్, టాలెంట్ ప్రో ఇండియా హెచ్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర 30కి పైగా ప్రముఖ కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుపుతాయి. 29 ఏళ్లకు మించని వయసున్నవారు దీనిలో పాల్గొనేందుకు అర్హులు. ఉద్యోగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారి నుంచి ఫ్రెషర్స్ వరకూ అందరూ దీనికి హాజరుకావచ్చు. ఆసక్తి గలవారు www.freshersjobfair.in లేదా https://www.data-facebook.com/www.freshersjobfair.in/ లో సంప్రదించాలి. మరింత సమాచారం కోసం 9177396535 / 9515383873 / 9000790462 / 9100227913 / 9100472535 / 9739179802. నంబర్లకు ఫోన్ చేయాలి.
జాబ్ మేళా వేదిక
Methodist College of Engineering and Technology.
H.No. 4-1-1001/1045/878B & 3-2, King Koti Road, Besides Tajmahal Hotel,
Behind Brand Factory, Abids, Hyderabad, Telangana 500001
గమనిక
ఇటీవల ఉప్పల్ జాబ్ మేళాలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని... అభ్యర్థులు ముందుగానే తగు సమాచారం సేకరించి, నిర్ధారణ చేసుకున్న తరవాత జాబ్ మేళాకు హాజరు కాగలరు.