మోదీ ఫోన్ చేయలేదనే.. ట్రంప్ ఇండియాపై పగబట్టారా?
ట్రంప్ వాణిజ్య ఒప్పందాలను నిర్ణయించే విధానాన్ని నిచ్చెనలా వర్ణించారు. మొదటి దేశం ఉత్తమ షరతులు పొందుతుందని, ఆ తర్వాత వచ్చే దేశాలకు కఠిన నిబంధనలు వర్తిస్తాయని వివరించారు. యూకే తర్వాత ఇండియా తర్వాతి దశలో ఉందని, మూడు శుక్రవారాల సమయం ఇచ్చినా భారత్ సద్వినియోగం చేసుకోలేదని లుట్నిక్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆగస్టు నుంచి అమెరికా భారత వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించిన నేపథ్యంలో వచ్చాయి.
భారత విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. లుట్నిక్ చెప్పిన విధంగా చర్చలు జరగలేదని, ఆ వివరణ సరైనది కాదని స్పష్టం చేసింది. 2025 ఫిబ్రవరి 13న మోదీ ట్రంప్ సమావేశం తర్వాత నుంచి వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. అనేక సార్లు ఒప్పందం దగ్గరలోకి వచ్చినా పూర్తి కాలేదని వివరించింది. గత సంవత్సరంలోనే మోదీ ట్రంప్ మధ్య ఎనిమిది సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని, ఇవి ద్వైపాక్షిక సంబంధాల వివిధ అంశాలపై దృష్టి సారించాయని శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు.
రెండు దేశాలు పరస్పర ప్రయోజనాలతో కూడిన ఒప్పందం కోసం కృషి చేస్తున్నాయని, దానిని పూర్తి చేసేందుకు ఆసక్తి కొనసాగుతోందని శాఖ పేర్కొంది. రష్యా నుంచి నూనె కొనుగోళ్లు టారిఫ్ విధానాలకు కారణమనే ఆరోపణల మధ్య ఈ చర్చలు కొనసాగుతున్నాయి.ఈ వివాదం ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఒత్తిడిని సృష్టించింది. లుట్నిక్ వ్యాఖ్యలు ట్రంప్ వ్యక్తిగత ఆగ్రహాన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ రష్యా నూనె కొనుగోళ్లు కొనసాగించడం అమెరికాకు అసంతృప్తి కలిగిస్తోంది.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.