హైదరాబాద్ భూములు.. కేటీఆర్ కిటికీ తెరిస్తే.. రేవంత్ తలుపులు తెరిచేశారా?
రాజకీయ వర్గాలు ఈ ఆరోపణలతో కలవరపడ్డాయి. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కవిత మాటలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కవిత మాటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సెలెక్టివ్గా బీఆర్ఎస్ హయాంలోని దొంగ దారులను రహదారులుగా మార్చుకుంటోందనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఇటీవల కోకాపేట, ఖానాపూర్, ఏరంగల ప్రాంతాల్లో జరుగుతున్న భారీ రియల్ ఎస్టేట్ లావాదేవీలు, పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
బీఆర్ఎస్ పాలనలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు, ఫార్మా సిటీ ప్రాంతంలో భూముల సేకరణలో జరిగిన అక్రమాలను గుర్తు చేస్తూ కవిత మాట్లాడారు. ఇప్పుడు అదే భూములు కాంగ్రెస్ హయాంలో మరింత వేగంగా మారుతున్నాయని ఆమె సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా ద్వారా కొన్ని చోట్ల ఆక్రమణలు కూల్చుతూనే మరికొన్ని చోట్ల కళ్లు మూసుకుంటోందనే అనుమానాలు బలపడుతున్నాయి. కవిత ఈ విషయాలను బహిరంగంగా చెబుతూ రెండు పార్టీలనూ ఒకేసారి టార్గెట్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయని కవిత నిర్మొహమాటంగా అంగీకరించారు. అయితే ఆ తప్పిదాలను ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ సరిదిద్దకుండా స్వయంగా అనుభవిస్తోందని ఆమె ఎత్తి చూపారు. హిల్ట్ పాలసీ ద్వారా పారిశ్రామిక భూములను రెసిడెన్షియల్గా మార్చే అవకాశం బీఆర్ఎస్ హయాంలోనే కల్పించగా, ఇప్పుడు ఆ పాలసీని కాంగ్రెస్ మరింత ఉదారంగా అమలు చేస్తోందని కవిత ఆరోపించారు. ఇటీవల జరిగిన కొన్ని భారీ భూ లావాదేవీల్లో రాజకీయ నాయకుల బినామీలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు