అమెరికాలోని భారతీయులకి మరో షాక్..? ఈ సారి ఏంటి అంటే..!

అమెరికాలో అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్‌ ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక యుద్ధ విమానాలు పెట్టి మరీ వలసదారుల్ని సాగనంపుతున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్.  ఇప్పుడు వీసా గడువు ముగిసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.  దీంతో హెచ్‌-1బీ వీసాదారులకు , వారి కుటుంబాలు తెగ భయపడుతున్నాయి.


హెచ్‌1బీ వీసాదారుల పిల్లలు డిపెండెంట్‌ వీసా (H-4) కింద అమెరికాలో ఉండే అవకాశాన్ని పొందుతారు. అయితే ఈ వీసా 21 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ వయసు పూర్తయిన తర్వాత వారు కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత సమాచారం మేరకు, ఈ స్థితిలో ఉన్న భారతీయ చిన్నారుల సంఖ్య సుమారు 1.34 లక్షలు. వీసా గడువు ముగిసే సమయంలో ఉన్నత విద్య కోసం ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక పరిమితులతో ముడిపడి ఉంది. అంతర్జాతీయ విద్యార్థులుగా నమోదు అయితే స్కాలర్‌షిప్‌ వంటి ప్రయోజనాలకు వారు అర్హులు కారనే ఆందోళన నెలకొంది.  అంతేకాకుండా, ఈ వీసా పొందడం కూడా తేలికైన పని కాదు.


ఇటీవల టెక్సాస్ న్యాయస్థానం తీర్పు ప్రకారం డీఏసీఏ చట్ట విరుద్ధమైనదని, దీని కింద వర్క్‌ పర్మిట్‌ పొందడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో, అమెరికాలోని అనేక మంది భారతీయ పిల్లల భవిష్యత్తుపై మబ్బులు కమ్ముకున్నాయి. హెచ్‌-1బీ వీసాదారుల తల్లిదండ్రులు గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దాని కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ సమయంలో వారి పిల్లలు 21 ఏళ్లు దాటితే, వారు ఇకపై డిపెండెంట్‌ వీసా కింద కొనసాగలేరు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్వదేశానికి పంపాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.


అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక రక్షణ లేనిపక్షంలో, వేలాది మంది భారతీయ కుటుంబాలు కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. లక్షకు పైగా భారతీయ పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి ఇండియాకు ఉన్న ఫళంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: