చంద్రబాబు మాటని లెక్క చేయని టీడీపీ ఎమ్మెల్యేలు?

చెప్పిన మాట విఏ చంద్రబాబు అంత మంచోడు లేరు అంటారు. తోక చాడించి.. తెర వెనుక వేషాలు వేస్తే ఆ తోకలు కత్తిరించే విషయంలో ఆయనంత స్ర్టాంగ్ మరెవరూ ఉండరని చెబుతుంటారు చాలా మంది. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలకు తాజాగా రెండో అనుభవం ఎదురైందని అంటున్నారు విశ్లేషకులు. అందుకు కారణాలు టెండర్లలో తమ్ముళ్లు వేలు పెట్టడమే.


ప్రస్తుత రాజకీయాలు బాగా మారిపోయాయి. నేతలు ఎవరైనా మాట తప్పినా.. తప్పులు చేస్తున్నా ప్రజలు ఏ మాత్రం మర్చిపోవడం లేదు. మనసులో పెట్టుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు తాట తీసేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నామనే ధైర్యంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఈ విషయం మరిచిపోయి చంద్రబాబు చెప్పినా వినడం లేదని అంటున్నారు.  నేతలు ఎవరూ కూడా లిక్కర్, ఇసుక టెండర్ల లో ఇష్టా రాజ్యంగా వ్యవహరించకూడదని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.


అయితే .. అమరావతిలో ఉన్న చంద్రబాబుకి నియోజకవర్గంలో తాము చేస్తున్న వ్యవహారాలు ఎలా తెలుస్తాయి అనుకున్నారు ఏమో.. కానీ ఓ 18 మంది ఎమ్మెల్యేలు ఏపీ సీఎం కళ్లుగప్పి సొంత పెత్తనాలు చేశారంట.  అయితే.. చంద్రబాబు తనదైన నిఘాతో ఆ విషయం తెలుసుకోగలిగారని అంటున్నారు. ప్రస్తుతం వీరిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఎవరైనా మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించినా.. కొంత మంది ఎమ్మెల్యేలు తీరు మారలేదని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారనే అంటున్నారు.


ఈ నేపథ్యంలోనే ఆయన నేతలతో భేటీ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి వారి కుటుంబ సభ్యులు ఎక్కడా తల దూర్చడానికి వీలు లేదని ఆయన గట్టిగా చెప్పారని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ అవినీతికి పాల్పడుతుందటూ ఆరోపణలు చేస్తుంది విపక్షం. 


 ఈ నేపథ్యంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. సుమారు 18 మంది ఎమ్మెల్యేల ప్రవర్తన విసిగిస్తోందని చంద్రబాబు సన్నిహితుల వద్ద అన్నట్లు పార్టీలో చర్చ నడుస్తోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: