ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. సైలెంట్ గా తన పని కానిస్తున్న అమెరికా?

ఇరాన్ ఇటీవల అమెరికా సైనిక సిబ్బందిని ఇజ్రాయెల్ లోని ప్రదేశాల నుంచి దూరంగా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది. కానీ అమెరికా మరింత దూకుడుగా ఇజ్రాయెల్ కు మద్దతు అందిస్తోంది. ఆ దేశంలో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిఘటనా చర్యగా.. ఇజ్రాయెల్ ఈ వ్యవస్థలను చక్కగా ఉపయోగించేందుకు సిద్ధమవుతుందని అమెరికా పేర్కొనడం.. పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళన కలిగించింది.


ఇరాన్ కు అమెరికా శత్రు దేశాలు తోడైతే.. ఎక్కడ ప్రపంచ యుద్ధం మొదలు అవుతుందోనని భయం కూడా చాలా దేశాల్లో ఉంది. ఇక అమెరికా సైనిక శాఖ, పెంటగాన్ ప్రకటించినట్లు, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ ని ఇజ్రాయెల్ కు పంపిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవస్థ బాలిస్టిక్ క్షిపణులను నిరోధించడానికి అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది.


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కు ఈ చర్యకు అనుమతి ఇచ్చారని ప్రకటించారు. ఇరాన్ ఈ క్రమంలో అమెరికాపై ఆరోపణలు చేస్తూ.. ఇజ్రాయెల్ కు అత్యధిక స్థాయిలో ఆయుధాలను అందిస్తున్నదని అని పేర్కొంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయాద్ అబ్బాస్ ఆరాఘ్బీ, పశ్చిమాసియాలో యుద్ధం నివారించేందుకు తమ దేశం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.


 ఇక ఇరుదేశాల మధ్య టెన్షన్ పెరిగిపోతుండగా.. అమెరికా ఇజ్రాయెల్ కు సపోర్టుగా గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వహించేందుకు సైనిక బలగాలను కూడా పంపుతోంది. ఇరాన్ ఈ చర్యలకు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తమ ప్రజల మరియు దేశ ప్రయోజనాను కాపాడుకునేందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో అల్లర్లు మరియు స్థిరత్వం కోల్పోయిన పరిస్థితులు యుద్ధానికి దారి తీస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ యుద్ధంలో అమెరికా ఎలాంటి పరిష్కారాన్ని తీసుకొస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: