మరో మహమ్మారి రోగం రాబోతోందా?
దీంతో పాటు ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేయడంతో ప్రపంచ మార్కెటింగ్ లో కార్పొరేట్ మాఫియాకు ఆదాయం గండిపడింది. ఇప్పుడు తాజాగా డిసీజ్ ఎక్స్ పేరుతో ఓ గుర్తు తెలియని జబ్బు రాబోతుంది. ఇది కరోనా కంటే ప్రమాదకరం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలోని అన్ని దేశాలను సంతకం చేయాలంటూ ఒత్తిడి తెస్తోంది. ఇలా చేస్తే దీనికి వ్యాక్సిన్ వేయాలా వద్దా అని డబ్ల్యూ హెచ్ వో నిర్ణయిస్తుంది.
మన దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ కు కూడా డబ్ల్యూ హెచ్ వో త్వరగా అనుమతి ఇవ్వలేదు. ఇతర దేశాలైన అమెరికా, రష్యా లకు త్వరగా అనుమతి ఇచ్చింది. మనకి మాత్రం ఇవ్వలేదు. చైనా వ్యాక్సిన్ కు కూడా ఓకే చెప్పి భారత్ వ్యాక్సిన్ ను మాత్రం కావాలనే అనుమతి ఇవ్వకుండా చాలా రోజులు ఆపింది. ఇప్పుడు కూడా డీసీజ్ ఎక్స్ పై అన్ని దేశాలు సంతకం పెడితే వాళ్లు చెప్పినట్లే నడుచుకోవాలి. లేకపోతే ఐరాస దళాలు వస్తాయి. అమెరికా, రష్యా, చైనా మాఫియా తో చేతులు కలిపిన డబ్ల్యూ హెచ్ వో సంస్థ మనదేశంపై కూడా సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తోంది. కానీ భారత్ దీనికి సుముఖంగా లేదు.