జగన్‌కు పెద్ద దెబ్బ.. ఆ నేత కూడా దూరం?

నెల్లూరు లో మరో కీలక వైసీపీ నేత పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? ఎంపీ టికెట్ ఇచ్చినా వద్దంటున్నారా? అంటే  అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. శనివారం మధ్యాహ్నం ఉన్నపళాన నెల్లూరు నుంచి పయనమయ్యారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుచరులకు, సిబ్బందికి సూచనలిచ్చారు.

త్వరలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. తాను కొన్ని రోజులు ఎవర్నీ కలవను అని చెప్పినట్లు తెలిసింది. దీంతో పాటు ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.  ఈసారి నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను అధిష్ఠానం ప్రకటించింది. తన పరిధిలోకి వచ్చే మూడు నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని ఆయన తొలి నుంచి పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్ఠానం స్పందిచకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

అనంతరం మళ్లీ చురుగ్గా వ్యవహరించిన ఆయన నెల్లూరు నగర అసెంబ్లీ పార్టీ టికెట్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు రాకుండా చేసి పంతం నెగ్గించుకున్నారు. ఆయన స్థానంలో తన భార్య వేమిరెడ్డి ప్రశాంత రెడ్డికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ముస్లిం మైనార్టీలకు ఇవ్వదలిస్తే మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ కు కేటాయించాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

కానీ సీఎం జగన్ ఇవేమీ పట్టించుకోకుండా అనిల్ కుమార్ అనుచరుడు, నగర డిప్యుటీ మేయర్ ఎండీ ఖలీల్ ను సమన్వయకర్తగా ప్రకటించింది. ఇది వేమిరెడ్డి మనస్తాపానికి కారణమైంది. సమన్వయకర్త ప్రకటనపై కనీసం సమాచారం ఇవ్వలేదని ఆయన అలకబూనారు. తనకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారే తప్ప సరైన గౌరవం దక్కడం లేదని సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ రాజకీయాలు తనకు సరిపోవని అందుకే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన కీలక నిర్ణయం తీసుకుంటే మాత్రం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: