ఆ రెండు జిల్లాల్లో చంద్రబాబు సీక్రెట్ గేమ్?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశం వదలకూడదని భావిస్తున్నాయి. అందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. గుంటూరు కృష్ణా జిల్లాలో వైసీపీపై ఓ రకమైన వ్యతిరేకత ఉంది. అమరావతి రాజధానిని నిర్వీర్య చేశారని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ సర్కారుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

అయితే సంక్షేమ పథకాల ద్వారా దీనిని అధిగమించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.  ఈ రెండు జిల్లాలను స్వీప్ చేయాలని టీడీపీ జనసేన భావిస్తున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్ఓ ఆ కూటమికి ఏకపక్ష విజయాలు దక్కుతాయని విశ్లేషణలు ఉన్నాయి. వీటికి కృష్ణా, గుంటూరు తోడైతే అధికారానికి కావాల్సిన మోజార్టీ స్థానాలు దక్కించుకోవచ్చు అనే ఆలోచన చేస్తున్నాయి. రాబోయేది తెలగు దేశం ప్రభుత్వమే అని చెప్పే ప్రయత్నం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు సైతం కొంతమంది పెద్దలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వస్తున్న వారు నేరుగా అక్కడి రైతులతో సమావేశం అవుతారు. ఎకరా రూ.30లక్షలు ఉంటే దానిని రూ.90లక్షలకు బేరం ఆడుతున్నారు. పది రూపాయల ప్రాంశరీ నోటు పై ఒప్పందం చేసుకుంటున్నారు. లక్ష రూపాయలను అడ్వాన్స్ గా చెల్లిస్తున్నారు. వాటిపై ఎటువంటి ఆధార్ కార్డు నెంబర్లు ధ్రువీకరించడం లేదు.

మరికొద్ది రోజుల్లో మిగతా మొత్తం చెల్లించి రిజిస్ర్టేషన్ చేసుకుందామని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ మేం రాకున్నా లక్ష రూపాయల అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. అటు ఎటువంటి ఆధార్ ధ్రువీకరణ లేకపోవడం, లక్ష కూడా ఇచ్చే పని లేకపోవడంతో రైతులు కూడా సంతకాలు పెడుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అనే ఒక రకమైన లాజిక్ ప్లే చేసేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అని ప్రకటించింది. వైసీపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో పాటు టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కల్పించి.. ఆ రెండు జిల్లాల్లో ఏకపక్ష విజయానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: