జీ20 వేదికగా అమెరికా, రష్యా రాజకీయాలు?
మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు. కానీ పుతిన్ సమావేశాలకు రావడం లేదని కబురు పంపారు. రష్యా కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని భావించడంపై ఖండించింది. జీ 20 సదస్సును ఉక్రెయిన్ గురించి మాట్లాడటం, ఉక్రెయిన్ కు అనుకూలంగా స్టేట్ మెంట్స్ ఇప్పించడం, రష్యా కు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని అమెరికా భావిస్తోందని ముఖ్యంగా ఇండియాతో కూడా ఎలాగైనా తీర్మానంపై సంతకం చేయించాలని అనుకుంటోందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రష్యా ప్రకటన వెలువరించింది. అయితే జీ 20 సదస్సు కోస న్యూ ఢిల్లీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సమావేశాలు జరిగే మూడు రోజులు ఢిల్లీకి సెలవులు ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు. సెలవులు ఉన్నాయని బయటకు రాకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు. అమెరికా అధ్యక్షుడితో పాటు 45 దేశాల వారు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలో కేంద్రం తలమునకలైంది. జీ 20 సదస్సును ఎలాగైనా విజయవంతం చేయాలని భావిస్తోంది.