చంద్రబాబు ఓటమికి రెడీ అయిపోతున్నారా?

ఆంధ్రలో ఓట్లను తీసేస్తున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాల మీద కథనాలు రాస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏకంగా 60 లక్షల ఓట్లను వైసీపీ ప్రభుత్వం తీసేస్తుందని, దాదాపు ఆ సంఖ్య కోటి వరకు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంత భారీ స్థాయిలో ఒక రాష్ట్రంలో ఎవరైనా ఓట్లను తీసేస్తారా? ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా? మరెందుకు ఇలా రాస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాస్తున్నారా? లేక చంద్రబాబు డైరెక్షన్ లోనే రాస్తున్నారా అనేది తెలియడం లేదు.


ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఢిల్లీ వెళ్లి ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కలిసి ఏపీలో దాదాపు 15 లక్షల ఓట్లను వైసీపీ ప్రభుత్వం తొలిగించింది. వాటిని పునరుద్ధించాలని కోరారు. అయితే ఎల్లో మీడియా మాత్రం 60 లక్షల ఓట్లు అంటూ నానా యాగి చేశారు. చివరకు బాబు మాత్రం 15 లక్షల ఓట్లను తొలగించారని కంప్లైట్ ఇవ్వడంతో ఇప్పుడు ఏం రాయాలో తెలియక తికమక పడుతున్నారు.


గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా దాదాపు 5 లక్షల ఓట్లను తొలగించారని వైసీపీ ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేసింది. కానీ దానికి సంబంధించి 3 లక్షల ఓట్లని తర్వాత తేలింది. వాటిని ఎన్నికల కమిషన్ యధావిధిగా తీసుకొచ్చింది. అప్పుడు వైసీపీ అనుకూల ఓట్లను టీడీపీ తొలగించిందని ప్రధాన ఆరోపణ. సెమ్ సీన్ రిపీట్ అవుతోందని టీడీపీ తెగ గగ్గోలు పెడుతుంది.


టీడీపీ అనుకూల ఓట్లు ఇటు ఆంధ్రలో అటు హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నాయి. వారు అక్కడ ఇక్కడ ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ అలా రెండు చోట్ల ఓట్లు వేసే వారి ఓట్లను తొలగించాలని ఆదేశించారు. దీంతో చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ గడప తొక్కాల్సి వచ్చింది. మరి ఎన్నికల కమిషన్ ఎలక్షన్ల నాటికి తొలగించిన ఓట్లను తిరిగి ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: