ఆంధ్రాపై విష ప్రచారం.. ఏ రేంజ్లో అంటే?
2022-23 నుండి జీఎస్టీపీలో వేగవంతమైన నమోదు జరుగుతుందని అని ఆ నివేదిక తెలియజేసింది. 2027 సంవత్సరానికి దేశ ఆర్థిక పరిస్థితితో పాటు ఏపీ సహా 15 రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందుతాయనే విషయం మీద ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక ఒక ఫలితాన్ని విడుదల చేసింది. 2027 నాటికి తెలంగాణను అధిగమించి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి పెరుగుతుందని నివేదిక చెప్తుంది.
2022 నుంచి ఆర్థిక రంగంలో ఈ వేగం పుంజుకుందని తెలుస్తుంది. ఇది ఇలానే వృద్ధి చెందుతూ 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మూడవ స్థానంలోకి చేరుకుంటుందని ఆ నివేదిక తెలుపుతుంది. దాని ప్రకారం మహారాష్ట్ర లెక్క దేశ జీడీపీలో 13 శాతానికి చేరుకుంటుందని, దాన్ని జిఎస్టిపిలో లెక్క వేస్తే 51లక్షల 76వేల కోట్లకు చేరుకుంటుందని సమాచారం.
అలాగే ఉత్తరప్రదేశ్ లో 41లక్షల 20వేల కోట్లు, తమిళనాడులో 34 లక్షల 8 వేల కోట్లు, కర్ణాటకలో 30లక్షల 60వేల కోట్లు, గుజరాత్ 30 లక్షల 58 వేల కోట్లు రాజస్థాన్ 20లక్షల16,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ 19లక్షల44 వేల కోట్లు తెలంగాణ 19లక్షల 12,000కోట్లు మధ్యప్రదేశ్ 18లక్షల 72000కోట్లు కేరళ 15 లక్షల 44వేల కోట్లకు చేరుకోవచ్చని అంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆంధ్రప్రదేశ్ అలాగే భారత్ కూడా ఆర్థికంగా వెనకబడిపోయాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్లు కాగ్ చెప్పిన, కేంద్రం చెప్పిన, రిజర్వ్ బ్యాంక్ చెప్పిన మాటను కూడా తప్పు అనే అంటారు.