పవన్‌ కోసం నాగబాబు వ్యూహాలు.. ఫలిస్తాయా?

మొన్నటి వరకు విరామం లేకుండా వారాహి రథం ఎక్కి ప్రచార యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం కొంత గ్యాప్ ఇచ్చారు. అయితే బ్రో రిలీజ్ తర్వాత ఆయన తిరిగి తన రాజకీయ ప్రచారాన్ని మొదలు పెడతారు అన్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక పక్కన తన నమ్ముకున్న వాళ్ళ కోసం రాజకీయంలో బిజీగా ఉంటున్నారు. అలాగే  భారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగు దేశంతో పొత్తు పెట్టుకునే దిశ గా కూడా ముందుకు వెళ్తున్నారు.


అదే సమయంలో తన  సినిమాలు చూసే వారి కోసం, అభిమానుల కోసం సినిమాలలో కూడా బిజీగా ఉంటున్నారు. అలా ఆయన అటు రాజకీయాల కోసం, ఇటు సినిమాల కోసం పగలు, రాత్రి కష్టపడుతున్నారు. అలాగే జన సేన పార్టీని సొంత రాష్ట్రంలోనే కాక విదేశాలలో కూడా బలపరిచే విధంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు సోదరుడైన నాగబాబుకు  జనసేనకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నట్లుగా తెలుస్తుంది.


గతంలో జనసేన పార్టీ తరఫున పరోక్షంగా పనిచేసుకుంటూ వచ్చిన నాగబాబు ఇప్పుడు ప్రత్యక్షంగా తన వంతు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఇప్పుడు జనసేన పార్టీలో ఆయన క్రియాశీల బాధ్యత కూడా చేపట్టాడని తెలుస్తుంది. ముఖ్యంగా విదేశాలలో జనసేన పార్టీని బలపరిచే విధంగా ఆయన ప్రయత్నిస్తున్నారు. అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన టీములను కూడా సిద్ధం చేస్తున్నారు.


 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన  టీం లు విదేశాలలో నడుస్తున్నాయి. అక్కడున్నటువంటి మన తెలుగు వాళ్ళు  పార్టీ తరఫున గ్రూపులుగా ఏర్పడి తమ కార్యాచరణను నిర్వహిస్తున్నారు. ఈమధ్య వైఎస్ఆర్సిపి టీమ్స్ కూడా ఏర్పడ్డాయి అక్కడ. ఇప్పుడు ఇదే క్రమంలో జనసేన శాఖలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. దీనిలో భాగంగానే నాగబాబు బ్రిటన్, అమెరికా, జర్మనీలలో పర్యటనలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం  ఎఫెక్ట్ ఉన్నా కూడా జనసేన విభాగ సభ్యులు అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: