భారత్‌లో ముస్లింల పరిస్థితిపై సంచలన రిపోర్ట్‌?

భారతదేశం  అన్ని మతాలకు నెలవైన ప్రదేశం. ఇక్కడ ఏ మతం వాళ్ళైనా ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పొరుగు దేశాల్లో ఉన్నట్లుగా ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ప్రత్యేకించి ముస్లిం వాళ్లకి ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. వాళ్లు ఇక్కడ ఎంతో స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. వాళ్లు బురఖా ధరించాలి అనుకున్నప్పుడు ధరిస్తారు. ధరించకూడదనుకున్నప్పుడు మానేస్తారు.


అలాగే హిజాబ్ విషయంలో కూడా వాళ్లకు నచ్చినప్పుడు మాత్రమే ధరిస్తారు.  వాళ్ళకి భారత దేశంలో ఆ స్వేచ్ఛ ఉంది. వాళ్లు స్కూల్ కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు, యూనివర్సిటీలకు వెళ్తారు. వాళ్లకి చదువు విషయంలో కూడా ఇంత వరకు మాత్రమే చదువుకోవాలి ముస్లిమ్స్ అని ఎటువంటి ఆంక్షలు ఉండవు. వాళ్లు ఇక్కడ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. వాళ్ల మత సంప్రదాయాలు ఇళ్లల్లో పాటిస్తారు.


బయటకు వచ్చిన తర్వాత సాధారణంగానే నివసిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్లకి కావాలంటే మతపరంగా, మత ప్రాతిపదికన దుస్తులు ధరిస్తారు. లేదంటే మామూలుగా బ్రతుకుతూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం ఇక్కడ. అదంతా వాళ్ళకి నచ్చి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని కూడా బద్నాం చేసే వాళ్లు, కుట్రలు చేసే వాళ్ళు తయారవుతున్నారు. వాళ్ల జీవన విధానం ఇక్కడ ప్రశాంతంగానే ఉంది.


కానీ ఆఫ్గనిస్తాన్ లాంటి దేశాల్లో అయితే ముస్లిం అమ్మాయి ఇలాగే ఉండాలి, ఇక్కడ వరకు మాత్రమే చదువుకోవాలి అన్నట్లుగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పాకిస్తాన్లో కూడా అలాగే ఉంటాయి. ఇంకా బంగ్లాదేశ్ లో కూడా అలాగే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అరబ్ దేశంలో కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ అమెరికా వెళుతున్న వేళ అక్కడ ఉన్నటువంటి సంస్థలు నాటకాలు ఆడడానికి చూస్తున్న సందర్భంలో ప్యూర్ రీసెర్చ్ అనే సంస్థ ఒక సర్వే  చేసింది. దాంట్లో భారత్ లో 98% ముస్లింలు తాము మతపరంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామని అంటే, కేవలం 2%  మాత్రమే మాకు మత స్వేచ్ఛ లేదని అంటున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: