పీకల్లోతు కష్టాల్లో చైనా.. పైకే బడాయి మాటలు?

చైనా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పైకి గొప్పగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఏమీ లేదని తెలుస్తుంది. ఇక్కడ రాష్ట్రాలుగా చెప్పుకునే ప్రాంతాలను చైనాలో ప్రావిన్స్ అని పిలుస్తారు. అట్లాంటి చైనాకు సంబంధించిన ప్రావిన్స్ లు చేసిన అప్పులు ఇప్పుడు ఎక్కువైపోయాయట. ఇదివరకు చైనా ప్రభుత్వం ఎంత చెప్తే అంతే అప్పు తీసుకునేవట ఈ ప్రావిన్సులు. కానీ చైనాలో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన జింపింగ్ వచ్చిన తర్వాత  మీకు ఎంత కావాలంటే అంత అప్పు తీసుకోండి. కానీ అది మీరే చెల్లించాలి అని చెప్పడం జరిగింది.


వాళ్ళైతే తీసుకోవడం జరిగింది కానీ, ఇప్పుడు తిరిగి చెల్లించడానికి ఎవరి దగ్గర సొమ్ము లేనటువంటి పరిస్థితి. అక్కడ బ్యాంకులో డబ్బులు లేవు, ప్రజలకు తిరిగి చెల్లించడానికి డబ్బులు లేవు, రియల్ ఎస్టేట్ కి డబ్బులు లేవు. అడిగితే దానికి కారణం బ్యాంకింగ్ సంక్షోభం, ఇంకా రియల్ ఎస్టేట్ సంక్షోభం అని చెప్పడం అయితే గతంలో జరిగింది. దీనిపై నివేదిక ఇప్పుడు వచ్చిందని తెలుస్తుంది‌. ఆ నివేదికల ప్రకారం ఏకంగా 8.3 ట్రిలియన్ డాలర్ల అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు.


పోనీ అక్కడ ప్రభుత్వం అయినా కట్టే పరిస్థితిలో ఉందా అంటే లేదని తెలుస్తుంది. ఎందుకంటే బిల్టన్ రోడ్డు ఇనిషియేటివ్ కే లక్షల కోట్ల రూపాయల ఖర్చు అయిపోయింది. యాక్చువల్ గా 1990లో నిబంధనలు  మార్చినప్పుడు నుంచి వీళ్ళు హ్యాపీ ఫీలయ్యారని తెలుస్తుంది. బిల్డన్ రోడ్డు ఇనిషియేటివ్ పేరు మీద మూడు సంవత్సరాల్లో 78 బిలియన్ డాలర్లు అప్పైపోయినట్టు తెలుస్తుంది.


ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టేసి రోడ్లు ఎయిర్ పోర్టులు కట్టేశారు, బానే ఉంది కానీ కట్టిన వెంటనే వీటి నుంచి ఆదాయం అయితే వచ్చేయదు కదా. అందుకనే చైనా కు సంబంధించిన బ్యాంకులు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. అది కూడా పైన చెప్పుకున్నట్లు మూడు సంవత్సరాలకి 78 బిలియన్ డాలర్లు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: