ఆ విషయంలో.. అమెరికాపై మండిపడుతున్న చైనా?

తైవాన్  అధ్యక్షురాలు కింగ్ జెన్ మొన్న మొదలు పెట్టిన యాత్రలో భాగంగా, ప్రస్తుతం అమెరికాకి వెళ్ళింది.  చైనా వెంటనే దీనిపై సీరియస్ అయిపోయింది. అమెరికా మా అంతరింగ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఏంటని అడిగింది. తైవాన్ అనేది చైనాకి సంబంధించిన ప్రత్యేక దేశం కాదని, అది చైనా యొక్క ప్రావిన్స్ లో ఒకటి అని చెప్పింది.


అలాంటి  ప్రావిన్స్ లలో ఒకటైన తైవాన్  అధ్యక్షురాలు వచ్చి అమెరికా పర్యటనకు సంబంధించి అధికారికంగా చేయడానికి మేము అంగీకరించం. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చైనా చెప్పింది. ఆ వెంటనే అమెరికా స్పందించింది దీనిపై. ఆమె ఇప్పటికే 7సార్లు వచ్చింది అమెరికాకి, మరి ఏమిటి నీ ప్రాబ్లం అంటూ  స్పందించింది. 2016 లో ఎన్నికైనటువంటి ఆవిడని దెబ్బ కొట్టడానికి రాజకీయంగా పెద్ద కుట్రే చేసుకొచ్చారు.


అక్కడున్న ప్రతిపక్ష నేతకు డబ్బులు ఇచ్చి, పెద్ద ఎత్తున ఫండింగ్ చేసి, అక్కడ ఉన్న ప్రజలకు భద్రతాభావం కల్పించి, అక్కడున్న మీడియాని ఇన్ఫ్లూయన్స్ చేసి చైనా లేకపోతే బతకలేమని సుదీర్ఘ కాలం పాటు భారత లో చైనా లేకపోతే బతకలేము, చైనా ఫ్రీ, చైనా వస్తువులు తక్కువ రేట్ లో వస్తాయని ఇలా చైనా గురించి గొప్పగా చెబుతూ, మన భారతదేశంలోని మన మీడియాల ద్వారా మన భారతదేశాన్నే తక్కువ చేసి చూపిస్తూ ఎట్లా విషాన్ని నింపారో, ఇప్పుడు అక్కడ తైవాన్ లో ఇదే రకమైన విషాన్ని నింపుతున్నారు.


కానీ ఇక్కడ మనకు మోడీ వచ్చాడు. అలాంటి పదాలు, పదజాలన్నీ కంట్రోల్ చేయగలిగారు. కానీ అక్కడ మోడీ లాంటివాడు లేడు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడగలుగుతున్నారు. తాజాగా  చెక్ రిపబ్లిక్ తైవాన్ తో స్నేహం అంటుంది. దాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. చైనా తో ఉండాలనుకుంటే తైవాన్ ని గుర్తించకూడదు, అదే సందర్భంలో రక్తపాతరహితంగా హాంకాంగ్ ని చైనా మొన్న ఆక్రమించింది. ఇప్పుడు మళ్లీ అదే రకంగా  చేసుకు రాబోతుంది అని తెలుస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: