లీకేజీ వార్‌: బండి సంజయ్‌ వర్సెస్‌ కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వార్ నడుస్తోంది. లీకేజీతో కేటీఆర్‌కు సంబంధం ఉందని బండి సంజయ్ ఇప్పటికే ఆరోపించారు. అయితే దీనిపై కేటీఆర్‌ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనిపై స్పందించిన బండి సంజయ్.. ఉడుత బెదిరింపులకు బెదిరిపోయేదే లేదంటున్నారు. లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడుతానని...క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని..  సీఎం కేసీఆర్  కుమారుడి పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తానని తనకు లీగల్ నోటీసు జారీ చేసినట్లు వచ్చిన వార్తను పత్రికల్లో చూసినట్లు బండి సంజయ్‌ చెప్పారు.

తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో ఉన్నప్పటి స్థాయి కంటే నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని కేటీఆర్‌ నుద్దేశించి బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. కేసీఆర్ కొడుకు పరువు,  ప్రతిష్ట  విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే..... తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలనవల్ల ప్రశ్నార్థమైందని.... మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలని.. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటని బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేసీఆర్ కొడుకు కుసంస్కారానికి నిదర్శనమని.. ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్ కి ఎలా లీక్ అవుతున్నాయని.. శ్నాపత్రాలు పత్రాల లీకేజీ విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నందుకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదో జవాబివ్వకుండా తప్పిదాలను ప్రశ్నిస్తున్న మాపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తారా? సిట్ బెదిరింపులకు బెదిరేది లేదని బండి సంజయ్‌ తెలిపారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కుంభకోణం నుండి నేటి ప్రశ్నాపత్రాలు లీకేజ్ వరకు ఐటి శాఖ మంత్రే బాధ్యత వహించాలని బండి సంజయ్‌ పునరుద్ఘాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: