మన చిరు ధాన్యాలు.. ప్రపంచమంతా వెళ్లాలి?

సంప్రదాయ చిరుధాన్యాల పంట ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలి. ఇలా చేస్తే అన్నదాతకు ఆదాయ భద్రత కలుగుతుంది. ఇందుకు కేంద్రం ముందుకు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అంటున్నారు. హైదరాబాద్ మాదాపూర్ నొవొటెల్ హెచ్ఐసీసీలో అసోసియేషన్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా - అసోచాం ఆధ్వర్యంలో జరిగిన చిరుధాన్యాల సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇలా అన్నారు.

చిరుధాన్యాల రైతులు, అంకుర కేంద్రాల నిర్వాహకులు చాలా మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. రేపటి భవిష్యత్ తరాలకు ప్రపంచానికి అవసరమైన ఆహారం తెలంగాణ ఇవ్వగలదని బలంగా నమ్ముతున్నామని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.  అందుకే ఈ రంగం మీద దృష్టిసారించి రైతులకు అండగా నిలుస్తున్నామని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పంటల వైవిధ్యీకరణ, పంటల సాగు ప్రణాళిక, పంటల కొనుగోలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

గ్రామ గ్రామానికి విస్తరించిన బీఎస్ఎన్ఎల్‌ను నిర్వీర్యం చేసి జియో కంపెనీకి జవసత్వాలు కల్పించి వంద కోట్ల మంది చేతిలో సెల్‌ఫోన్లు పెట్టి వాడక తప్పనిసరి పరిస్థితి తీసుకువచ్చిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆక్షేపించారు. మరి మీరు పంటలు పండించండి మేం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాం అని రైతులకు ఎందుకు భరోసా ఇవ్వరు...? అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి  ప్రశ్నించారు. అదానీకి ఇచ్చిన భరోసా రైతాంగానికి ఎందుకు ఇవ్వరు...? అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

మీరు పండించండి కేంద్రంగా మేం సాయం అందిస్తాం... రాష్ట్రంగా మీరు కొంత సాయం చేయండని మోదీ సర్కారు ఎందుకు చెప్పదు...? అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. స్కాట్లాండ్ లాంటి చిన్న దేశం తమ ఉత్పత్తులైన స్కాచ్ బ్రాండ్ మద్యం ప్రపంచంలో మార్కెటింగ్ చేసుకుంటుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. ఎడారి దేశం సౌదీలో పండే ఖర్జూరం ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తుంటే చిరుధాన్యాల పుట్టినిల్లైన భారత్‌లో పండేవి అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఎందుకు ప్రచారం చేయవని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: