గోరంట్ల మాధవ్‌కు.. అక్కడ షాక్‌ తప్పదా?

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పోలీసులు ఒరిజినల్ వీడియో లేకుండా ఏమీ చేయలేమని చేతులు ఎత్తేయడమే కాకుండా.. అది మార్ఫింగ్ కావచ్చని సందేహాలు వెలిబుచ్చుతూ గోరంట్ల మాధవ్‌కు పరోక్షంగా అండగా నిలిచారు. దీంతో గోరంట్ల మాధవ్ కూడా తాను కడిగిన ముత్యం అంటూ బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఒక్క ఏపీ పోలీసులు క్లీన్ చిట్ ఇస్తే సరిపోదు కదా.

అసలే ఈ అంశం జాతీయ మీడియాలోనూ వచ్చింది. అంతేకాదు.. ఇప్పుడు ఏకంగా జాతీయ మహిళ కమిషన్ రంగంలోకి దిగింది. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది. అంతేకాదు.. గోరంట్ల ఎంపీ కాబట్టి.. లోక్ సభ స్పీకర్‌కు కూడా జాతీయ మహిళా కమిషన్  ఫిర్యాదు చేసింది. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరింది.

ఇప్పుడు ఈ అంశం ఢిల్లీకి చేరింది. ఒకవేళ జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ సీరియస్‌గా తీసుకుంటే.. గోరంట్ల మాధవ్‌కు చిక్కులు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై స్వతంత్ర్య దర్యాప్తును కు ఆదేశించిన కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించినా గోరంట్ల మాధవ్‌ చిక్కుల్లో పడే అవకాశం ఉంది.

ఇక ఈ అంశాన్ని టీడీపీ కూడా ఒక పట్టాన వదలడం లేదు. జాతీయ మహిళ కమిషన్ కు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో సహా ఏపీలో పెద్ద ఎత్తున మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయని లేఖలో అనిత వెల్లడించారు. ఎంపీ మాధవ్ వీడియోపై జాతీయ మహిళ కమిషన్ విచారణ జరపాలని అనిత కోరారు. మహిళలపై వేధింపులను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం ఉదాసీనంగా ఉందంటూ లేఖలో అనిత ఫిర్యాదు చేశారు. బాధిత మహిళల వివరాలను లేఖకు జత చేసి మహిళా కమిషన్ ఛైర్ పర్సనుకు అనిత పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: