కమ్యూనిస్టులూ.. సిద్ధాంతాలు కాదు.. జనం గోడు వినండి?
తాజాగా జరిగిన సీపీఎం మహాసభల్లో మరోసారి కమ్యూనిస్టుల ఐక్యత అంశం చర్చకు వచ్చిందట. కమ్యూనిస్టుల ఐక్యతపై సీపీఎం మహాసభల్లో ఆసక్తికరమైన చర్చ జరిగిందట. లెఫ్ట్ పార్టీలు కలవాలని అందరూ కోరుకుంటున్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేశారట. కమ్యూనిస్టులు కలవాలని ఎప్పుడో 16 ఏళ్ల క్రితమే బీవీ రాఘువులు విలీన ప్రతిపాదన చేశారని.. కానీ.. ఇప్పటి వరకూ రాఘవులు చేసిన ప్రతిపాదనపై ఒక్క అడుగూ ముందుకెళ్లలేదని సీపీఐ రామకృష్ణ గుర్తు చేశారట.
దీనికి బదులిచ్చిన బీవీ రాఘవులు.. అబ్బే.. రాజకీయాలు, ఓట్లు-సీట్ల కోసం కలిస్తే కమ్యూనిస్టులు కలిస్తే లాభం ఉండదు.. అని తేల్చి చెప్పేశారట. విధానాలు కలిసినప్పుడే లెఫ్ట్ పార్టీల ఐక్యత సాధ్యమన్నారట రాఘవులు. దీనికి స్పందించిన రామకృష్ణ.. కనీసం విధానాలపై చర్చయినా జరగాలి కదా అని ప్రశ్నించారట. అలా మరోసారి కమ్యూనిస్టుల ఐక్యత అంశం చర్చకు వచ్చింది.
కమ్యూనిస్టుల ఐక్యత సంగతి ఎలా ఉన్నా.. ముందు ఆ పార్టీలు ముందు తెలుగు ప్రజల సమస్యలపై ఫోకస్ పెడితే బావుంటుంది. వారు చెప్పే సిద్ధాంతాలు సామాన్యులకు ఎంత వరకూ అర్థమవుతాయన్నది ఆలోచించాలి.. తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల సమస్యలేంటి.. వాటికి పరిష్కారాలేంటి..అందుకు చేయాల్సిన కార్యాచరణ ఏంటి.. ఈ దిశగా ఎర్రన్నలు కదిలితే.. జనం కూడా ఆ పార్టీల గురించి ఆలోచిస్తారు.. ఏమంటారు..?