నివాళి : చిన్నారి చైత్రకు మన్నింపు అడగలేను?
పిల్లలంతా ఏమయిపోతున్నారు. బాల్యం, యవ్వనం ఈ రెంటి మధ్య తేడా ఏంటో తెలియని వయస్సులోనే పిల్లలు ఏమయిపోతు న్నారు. మట్టి తో ఆడే పిల్లలు లేరిప్పుడు. నాన్నతో ఆడే పిల్లలు బొమ్మలు లేవిప్పుడు. అమ్మకు నాలుగు మాటలు చెప్పే బిడ్డలు లేరిప్పుడు. కొందరి దాహం కారణంగా వారు వానల్లో కొట్టుకుపోతున్నారు. కన్నీటి వానల్లో కొట్టుకుపోతున్నారు.
దయనీయమ యిన మనుషులు ఎవ్వరూ లేరిక్కడ. నటన నేర్చిన మనుషులే ఇక్కడ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడెవరయినా అటు వెళ్లకండి సర్..ప్లీజ్ ! రాజ్యంలో మీరూ, మేమూ ఎప్పుడూ సమానం కాలేము. మా పిల్లల ప్రాణాలు మీ పిల్లల ప్రాణాలతో స మానం కావు. మా ఆడబిడ్డల దేహాలు మీ ఆడబిడ్డల దేహాలు ఎన్నడూ సర్వం సమానంగా రక్షణకు, భద్రతకు నోచుకోవు. పండుగ రోజు భగవంతుడు పసి పిల్లలను ఎందుకు దూరం చేశాడో తెల్సుకోలేం. ఇదంతా విధి అని తప్పుకోలేం. బాధను అంగీకరించలేం.
పసిపాప ప్రాణం తీసిన సందర్భాలను పొలిటికల్ రంగులు ఎందుకు వాడుకుంటున్నాయి అని అడగకండి. ఇప్పుడు అడిగినా, అడ గకున్నా వీరు మారరు. ఇవి దొంగ దీక్షల కాలం. కాలం చెల్లిన వాటిని మనం దగ్గరకు తీసుకోకూడదు. కాలాన్ని కొనుగోలు చేసి త మ గుప్పిట ఉంచిన వారిని మనం అస్సలు దరి చేరనివ్వ కూడదు. ఖరీదయిన మనుషులు రోడ్డెక్కి విలపిస్తుంటే భయంగా ఉంది.
భూమ్మీద నడిచే హక్కు, మాట్లాడే హక్కు వీరికే ఉందన్న భయం నాలో ఉంది. మీలోనూ ఉండాలి. వారి స్థితి ఎలా ఉన్నా, వారి ని నాదం ఏమై ఉన్నా ప్రాణాలు పోయిన బిడ్డలంతా ఒక్కచోట చేరి దేశం బాగు కోసం ఎదురు చూస్తున్నారు. ఆత్మను పరీక్షించి ఒక్క సారి అయినా దేహాన్ని శుభ్రం చేసుకోమని మాలిన్యమయం అయిన రాజకీయ నాయకులను అభ్యర్థిస్తున్నారు. కాస్తయినా వారి గోడు వినండి.