హెరాల్డ్ ఎడిటోరియల్ : డ్రాగన్ వ్యూహాలతో మనకు ఎప్పటికైనా సమస్యేనా ?
ఇంతకీ విషయం ఏమిటంటే 2027లో చైనా లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. అప్పటికి ఇపుడున్న చైనా రక్షణ వ్యవస్ధను మరింతగా బలోపేతం చేయాలని జిన్ పింగ్ ఇప్పటి నుండే అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సైన్యాన్ని పూర్తిగా ఆధునీకరించటంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఐఏ) లాంటి సాంకేతికతన నూరు శాతం వినియోగించుకోవాలని తాజాగా నిర్ణయించారు. ప్రంపంచం మొత్తంలో రక్షణ రంగానికి అత్యంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్నది అమెరికా మాత్రమే. అమెరికా ఏడాది బడ్జెట్ 732 బిలియన డాలర్లు. దాని తర్వాత ఎక్కువ రక్షణ రంగం కేటాయింపులుంటున్నది చైనాకు మాత్రమే. ప్రతి ఏడాది చైనా రక్షణ రంగం బడ్జెట్ కేటాయింపులు 179 బిలియన డాలర్లు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కేటాయింపులకు మించే ఖర్చు చేస్తోంది. 2019లో రక్షణ రంగానికి చేసిన ఖర్చు సుమారు 232 బిలియన్ డాలర్లు. అంటే కేటాయింపులకన్నా చాలా ఎక్కువ ఖర్చు చేస్తోందన్న విషయం అర్ధమైపోతోంది.
భారత్ సరిహద్దుల్లో ప్రతిరోజు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. గడచిన కొద్ది నెలలుగా డ్రాగన్ దేశం కావాలనే భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టి గొడవల్లోకి దింపుతోంది. ఇందుకోసం జమ్మూ-కాశ్మీర్ లోని లడ్డాఖ్ ప్రాంతంలోని గాల్వాన్, ప్యాంగ్యాంగ్, సియాచిన్ తదితర ప్రాంతాలను వాడుకుంటోంది. తన రక్షణ రంగం బడ్జెట్ ను పెంచుకోవటం, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవటం, సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైన్యాల అవసరాలను దగ్గరుండి మరీ చూసుకుంటున్న డ్రాగన్ ప్రభుత్వం మన దేశాన్ని గుక్క తిప్పుకోనీకుండా ఇబ్బందులు పెడుతోంది. అత్యంతాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలన్నా వేల కోట్ల రూపాయలు ఖర్చులు చేయాల్సిందే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడే చైనా తన అవసరాలకు మించి రక్షణ రంగానికి ఖర్చులు పెడుతోంది.