హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుపై ట్యాపింగ్ బాంబు వేసిన రాధాకృష్ణ.. బయటపెట్టిన ఎల్లోమీడియా
ఇక ప్రస్తుత విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ఆధారాలు చూపకుండానే ఓ కథనం రాసేశారు. ఇపుడు దాన్ని నిజమని నిరూపించేందుకు నానా అవస్తలు పడుతున్నారు. ఇందులో భాగంగానే రాసిన చెత్తపలుకులో ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇందిరాగాంధి హయాం నుండి జరుగుతున్నదే అంటూ రాధాకృష్ణ సెలవిచ్చాడు. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం సర్వసాధారణమైపోయిందని రాధాకృష్ణే అంగీకరించాడు. అంటే అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు ఎల్లోమీడియా అంగీకరిస్తున్నట్లే కదా ? పైగా చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు వైసిపి నేత ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సజ్జల రామకృష్ణారెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవమే అని ఒప్పుకున్నాడు. సజ్జల ఫోన్ను చంద్రబాబు ట్యాపింగ్ చేయించినట్లు రాధాకృష్ణే సర్టిఫై చేసేశాడు. బహుశా తాను చేయించిన ఫోన్ ట్యాపింగ్ ను రాధాకృష్ణ బయటపెట్టడంతో చంద్రబాబుకు షాక్ కొట్టుంటుంది.
ఫోన్ ట్యాపింగ్ అంశంతో హోంమంత్రికి కానీ లేదా డిజిపికి కూడా ముఖ్యమంత్రి తెలియనివ్వడని కూడా రాధాకృష్ణే చెప్పాడు. ప్రతిపక్ష నేతల ఫోన్లే కాదు చివరకు మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతోందేమో అనే అనుమానాన్ని కొందరు రాధాకృష్ణ దగ్గర వ్యక్తం చేశారట. ప్రత్యర్ధులంటే ప్రతిపక్షాల వాళ్ళు మాత్రమే అని రాధాకృష్ణ ఎలాగనుకున్నాడు ? స్వపక్షంలో నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు లాంటి ప్రత్యర్ధులు కూడా ఉంటారు కదా ? మరి అలాంటి వాళ్ళ విషయంలో జగన్ జాగ్రత్తలు తీసుకోవాలని అనుకోవటం తప్పెలాగవుతుంది ? అధికారం అనే సింహాసనం మీద కూర్చున్న వాళ్ళకు ఎటువైపు నుండి ఏరోజు ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి సింహాసనం మీదున్న వాళ్ళు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. ఈ జాగ్రత్తలు తీసుకోవటంలో తన మన అన్న తేడా ఉండదు. ఇటువంటి విషయంలో అప్పట్లో ఏమరుపాటుగా ఉండబట్టే ఆరోజుల్లో ఎన్టీయార్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడవగలిగాడు. అప్పట్లోనే ఎన్టీయార్ జాగ్రత్తగా ఉండుంటే చంద్రబాబు అసలు ముఖ్యమంత్రయ్యేవాడేనా ?