కేరళ స్టోరీ వివాదం.. అప్పట్లో ఎన్టీఆర్ సంచలనం?
భారతదేశంపై పాకిస్తాన్ లాంటి దేశాలకు ఎప్పటికీ శత్రుత్వ భావనే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ దేశానికైతే తాము వాళ్లకి కొంత మంది చేశాము కాబట్టి మన మంచిని కోరుకుంటుంది అది. కానీ అది తన మతం విషయంలో మాత్రం ఖరాఖండిగానే ఉంటుంది. పటాన్ ను ప్రోత్సహించిన వాళ్లే, కేరళ స్టోరీ సినిమాను మాత్రం మతపరమైన దాడి అంటారు. ఇది విద్వేషాలను రగల్చడమే అని అంటారు.
సీనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా అప్పట్లో కృష్ణ మండలాధీశుడు, ఇంకా సాహసమే నా ఊపిరి సినిమాలు కూడా ఆయన తీశారు. కానీ ఎన్టీఆర్ దాన్ని నిషేధించలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా ఆ సినిమాలపై ఎటువంటి వ్యతిరేకతతో నిరసనలు కూడా చేయలేదు. ఈ సందర్భాలను బట్టి అసలు ఇప్పుడు రామారావుని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. గతంలో ఆర్జీవి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి అనే సినిమా చేస్తే దానిపై ఎవరూ అంతగా వ్యతిరేక ప్రచారం చేయలేదు.
ఆ తర్వాత రామారావుపై రెండు సినిమాలు కూడా తీశారు. కానీ వాటిపై ఎవరూ వ్యతిరేకంగా ప్రచారం చేసుకు రాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక సినిమా తీశారు. కానీ ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా ఎవరు ప్రచారాలు, నిషేధాలు ఏమి చేయలేదు. మరి కేరళ స్టోరీ సినిమాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అని కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారని తెలుస్తుంది.