హైదరాబాద్‌ టెర్రరిస్ట్‌ ఫైల్స్‌: ముస్లింలుగా మారిన హిందువులు?

హైదరాబాద్ లో ఆరుగురు ఇస్లామిక్ రాడికల్స్ పట్టుబడటంతో కలకలం రేగుతోంది. దీంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. నిందితుల్లో బోఫాల్ కు చెందిన మహ్మద్ సలీం, ఒడిశాకు చెందిన అబ్దుర్ రహమాన్ తో పాటు నగరానికి చెందిన ఆరుగురు ఉన్నారు. అయితే.. ముగ్గురు నిందితులు హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారి ఆ తర్వాత ఇస్లామిక్ రాడికల్స్ గా మారినట్టు అనుమానిస్తున్నారు.

బోఫాల్‌ కు చెందిన సౌబర్ రాజ్ వైద్యం 2010లో ముస్లిం మతంలోకి మారి మహ్మద్ సలీంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. పెళ్లయిన అయిన తర్వాత కొన్నాళ్లకు ముస్లింగా మారిన సలీం, ఆ తర్వాత తన భార్యను కూడా ముస్లిం మతంలోకి మార్చినట్లు గుర్తించారు. 2018లో హైదరాబాద్ కు వచ్చిన సలీం దంపతులు గోల్కొండలో ఉంటున్నారు. ఒడిశాకు చెందిన దేవిప్రసాద్ సైతం అబ్దుల్ రహమాన్ గా మారాడని గుర్తించారు. క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్ గా పనిచేస్తూ సలీం ఉన్న కాలనీలోనే నివాసం ఉంటున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కనిపెట్టారు.

ఇక పరారీలో ఉన్న సల్మాన్ ను సైతం కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులకు వారు అప్పజెప్పారు. జవహార్ నగర్ బాలాజీ నగర్ లోని శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న సల్మాన్ టీవీ, సెల్ ఫోన్ మరమ్మతులు చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

అలాగే జగద్గిరిగుట్టకు చెందిన మహ్మద్ హమీద్, సల్మాన్ స్నేహితులని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సల్మాన్ ద్వారా హమీద్ ఇస్లామిక్ రాడికల్ గా మారినట్లు కూడా వారు గుర్తించారు. సల్మాన్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కెమేరాల ద్వారా సల్మాన్‌ ఇంటికి ఎవరెవరు వచ్చిపోయారనే వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం చూస్తుంటే.. కేరళ ఫైల్స్ తరహాలో హైదరాబాద్‌ ఫైల్స్‌ సినిమా తీసేంత విషయం ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: