బీజేపీకి షాక్: వాళ్లంతా టీడీపీ కోవర్టులేనా?
దీంతో బీజేపీని వీడి మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కన్నా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగితే టీడీపీతో పొత్తు సులభమయ్యేది. కానీ సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కుదరడం లేదు. దీంతో సోము వీర్రాజును, బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులు ఎవరూ వెళ్లడం లేదు. తెలుగుదేశం ఉద్దేశాలకు అనుగుణం పని చేసిన వారు ప్రస్తుతం చంద్రబాబు చెంతకు వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
కన్నా బీజేపీ అధ్యక్షుడయ్యాక ఆంధ్రలో బీజేపీకి ఓటింగ్ శాతం 1.2 శాతానికి పడిపోయింది. గతంలో కంటే 4 శాతంగా ఉన్న ఓటింగ్ 1.2 కు పడిపోవడం దారుణం. అదే సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ 303 స్థానాలు గెలుచుకుని రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చతికిలపడిపోయింది. దీని వల్ల బీజేపీకి ఆంధ్రలో తీవ్ర నష్టం జరిగింది. దీనికి కారణం ఏపీలో టీడీపీ వేసిన ఎత్తుగడల్లో బీజేపీ చిత్తవడమే. దానికి చంద్రబాబు సారథ్యం వహిస్తే, కన్నా యాక్టింగ్ చేశారు. ఏదేమైనా బీజేపీ నుంచి టీడీపీలోకి చేరికలు మాత్రం ఆగడం లేదు.