ఆ విషయంలో ఏపీ దేశంలోనే ఫస్ట్‌ ర్యాంక్‌?

పారిశ్రామికంగా, ఆర్ధికం గా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఏపీ ఆకర్షిస్తోందంటున్నారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. ఏపి జీ ఎస్డిపి 11.34 శాతం గా ఉంది జాతీయ సగటు తో పోలిస్తే ఏపీ చాలా ముందు ఉందని... కోవిడ్ సమయం లో వృద్ధి రేటు మైనస్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఏపీ సకరత్మక వృద్ధి నమోదు అయ్యిందని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఇక తలసరి ఆదాయం కూడా 38.5 శాతం పెరిగిందని.. కొందరు రాష్ట్ర వృద్ధి తిరోగమనం లో ఉందని ప్రచారం చేస్తుంటే ప్రతిపక్షాలు దానిపై వంత పాడుతున్నాయని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు.

వృద్ధి తిరోగమనం లో ఉన్నట్టు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. 2022 జూలై చివరి నాటికి ఏపి కి 40, 361 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. దేశవ్యప్తంగా 1,71 లక్షల కోట్లు పెట్టుబడి వస్తె అందులో అత్యధికం గా ఏపీ కే వచ్చాయని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివరించారు. 23,985 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిందని.. పెట్టుబడులు రాబట్టడం లో ఏపీ 5 స్థానం లో ఉందని.. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివరించారు.

ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ ఏపీ అగ్రస్థానం లో ఉందన్న ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ ఏపీ అగ్రస్థానం లో ఉందన్న  చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. అలయన్స్  టైర్స్ సంస్థ 1040 కోట్ల పెట్టుబడి తో విశాఖ లో ఉత్పత్తికి ముందుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం వల్ల దేశ విదేశీ సంస్థలు ఏపీ లో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని.. బల్క్ డ్రగ్ పార్కు కోసం 1000 కోట్ల గ్రాంట్ ఏపీ సాధించిందని  చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివరించారు.

కొవిడ్19 సమయంలో సూక్ష్మ, చిన్న మధ్య శ్రేణి పారిశ్రామిక సంస్థలకు రీ స్టార్ట్ ప్యాకేజీ ఇచ్చిందని చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ వివరించారు. రాజధానిని చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరని.. ప్రభుత్వ పరిపాలనను చూసే పెట్టుబడులు పెడతారు ఎవరైనా అంటూ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: