15 రోజుల్లో పూర్తి చేయండి.. మంత్రి విడదల రజని డెడ్లైన్?
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అధికారులను ఆదేశించారు. వ్యాధుల వ్యాప్తిని గమనిస్తూ అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. డెంగీ, మలేరియా వ్యాధి నిర్ధారణ కిట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పారు. వెంటనే ఫీవర్ సర్వేను చేపట్టాలన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని .. 15 రోజుల్లోగా ఇది పూర్తికావాలని డెడ్ లైన్ విధించారు. ఈ సర్వేకు సంబంధించి ఏ రోజు వివరాలు ఆ రోజు తనకు నేరుగా పంపాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆదేశించారు. ప్రజారోగ్యానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేస్తున్నారన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ... రాబోయే రోజుల్లో వైద్యారోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు.
జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అధికారులను ఆదేశించారు. అధికారుల పర్యటనల వల్ల పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, డీహెచ్లు, ఏహెచ్లలో వైద్య సేవలు మెరుగవుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ డాక్టర్ల హాజరుపై ప్రత్యేక నిఘా ఉంటుందని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
సీఎం వైయస్ జగన్ వేల కోట్ల రూపాయలు వైద్య శాఖ కోసం ఖర్చు చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుర్తు చేస్తున్నారు. అన్ని విష జ్వరాలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందేలా చేస్తున్నారన్న విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుర్తు చేశారు. డెంగీ, మలేరియా, చికెన్గున్యాతోపాటు కలరా, డయేరియా నివారణకు కావాల్సిన మందులన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా అందుబాటులో ఉన్నాయని.. మందుల కొరత అన్నది లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే వినతులపై అధికారులు తక్షణమే స్పందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆదేశించారు.