నెత్తుటి నిజం: వివేకాను కొడుతూ లేఖ రాయించారా?
తనను తన డ్రైవర్ ప్రసాద్ చంపాడని.. ఆ లేఖలో రాయడం విశేషం.. ఈ లేఖ చాలా కష్టంగా రాస్తున్నానని.. డ్రైవర్ ప్రసాద్ను వదలొద్దు అని ఆ లేఖలో ఉంది. అయితే.. ఈ లేఖను సీబీఐ స్వాధీనం చేసుకుని విశ్లేషణకు పంపింది.. ఈ లేఖపై ఫోరెన్సిక్ విశ్లేషణ ఇప్పుడు బయటకు వచ్చింది.. ఇందులో వివరాలు చాలా సంచలనం కలిగించేలా ఉన్నాయి. వివేకా హత్య జరిగిన రోజున దొరికిన లేఖపై సీబీఐ అభిప్రాయం, ఫోరెన్సిక్ నివేదిక ఇప్పుడు వెలుగు చూశాయి.
ఈ లేఖ గురించి ఫోరెన్సిక్ నివేదిక ఏం చెబుతుందంటే.. ఈ లేఖను ఆయన్ని కొడుతూ, ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించారట. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడితోనే వివేకానంద రెడ్డి తన చివరి నిమిషాల్లో ఈ లేఖ రాశారట. ఆ కారణంగానే ఆ లేఖలో వైఎస్ వివేకానంద రెడ్డి చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందట. వైఎస్ వివేకానంద రెడ్డి రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖలోని చేతిరాతను దిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పంపారు. అక్కడ ఫోరెన్సిక్ సైకలాజికల్ విశ్లేషణ చేయించారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో లేఖ రాశారో తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ ఉపయోగపడుతుంది.
ఈ విశ్లేషణను సీబీఐ అధికారులు కేసు విచారణలో భాగంగా దాఖలుచేసిన అభియోగపత్రంతో పాటు కోర్టుకు అందజేశారు. ఈ నివేదిక ప్రకారం.. వైఎస్ వివేకానంద రెడ్డి లేఖ రాసిన సమయంలో పెన్నుకు, మెదడుకు మధ్య సమన్వయం లేదట. ఈ లేఖ వైఎస్ వివేకానంద రెడ్డి సొంతంగా రాసినట్లు అనిపించట్లేదట. తీవ్రమైన ఒత్తిడి, బలప్రయోగం మధ్యే లేఖ రాశారట. చేతులు వణుకుతుండగా వైఎస్ వివేకానంద రెడ్డి రాసినట్లు కనిపిస్తోందని.. అక్షరాలు క్రమపద్ధతిలో లేవని.. పదాలు, వరుసల మధ్య పొంతన లేదని ఆ విశ్లేషణ తెలిపింది.