ఇక కేజ్రీవాల్ కథ ముగిసిందా? నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?

Chakravarthi Kalyan

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహం మార్చనుంది. ఒక్కో అసెంబ్లీ సీటుపై ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా సమీక్ష నిర్వహించనుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి చర్చ జరుగుతుంది. దిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఇతర నేతలకు జైలు శిక్ష విధించడం వల్ల పార్టీ ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం పడిందో ముందుగా అంచనా వేయనున్నారు.


ఆ తర్వాత పార్టీలోని బలహీనతలను గుర్తించి తొలగిస్తామని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హరియాణా, జమ్మూ కశ్మీర్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి నిరాశే ఎదురైంది. హరియాణా లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా సాధించలేకపోయింది. జమ్మూ కశ్మీర్ లో ఒక్క సీటుతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.


దీంతో రాబోయే దిల్లీ ఎన్నికలకు సంబంధించి కింది స్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు పార్టీ అగ్ర నాయకత్వం తమ నేతలకు సందేశం ఇచ్చింది. దిల్లీలో అభివృద్ధి మందగమనంతో పాటు పార్టీ నేతల ఇమేజ్ కి సంబంధించి సరైన పరిస్థితిని వెల్లడించడానికి, శ్రద్ధ గల, కష్టపడి పనిచేసే అట్టడుగు స్థాయి కార్యకర్తల ద్వారా పరిస్థితిని అంచనా వేయాలని కూడా స్పష్టం చేసింది.


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింత్ కేజ్రీవాల్ పరిస్థితిని అంచనా వేయకుండా ఏ పని చేయరు. దిల్లీలో తమ పార్టీ అధికారంలోకి రాని ప్రమాదం ఏం లేదనే తెలిసే ఆ నమ్మకంతోనే సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే ప్రజలకు మంచి పథకాలు అందించిన రెండు ప్రభుత్వాలు.. రాజస్థాన్ లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ ను ప్రజలు గద్దె దించారు. దీంతో ఆప్ ఆందోళన చెందుతోంది. కానీ అక్కడి పరిస్థితులు వేరు.. దిల్లీ వేరని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: