ఎన్నికల వేళ.. రఘురామకు సీబీఐ బిగ్ షాక్?
రఘురామ బ్యాంకులను రూ.వందల కోట్లకు ముంచేశారు. బ్యాంకులను మోసం చేసి రుణాలను తీసుకొని.. వాటిని సకాలంలో చెల్లించకుండా చేతులెత్తేశారు. పోనీ ఆ రుణాలను ఎక్కడైనా పెట్టుబడులుగా పెట్టి వ్యాపారంలో నష్టపోయారా అంటే అదీ లేదు. కేవలం బ్యాంకులను మోసం చేయడానికి తీసుకున్న రుణాలు. ఇండ్ భారత్ కంపెనీ పేరుతో థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు రూ.974 కోట్ల రుణం తీసుకున్నారు.
అయితే కంపెనీ పెట్టకుండా ఆయన పెద్ద గేమే ఆడారు. ఆ అప్పుని తీసుకెళ్లి వివిధ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారు. అలా చేసిన సొమ్ముపై తిరిగి ఆయా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు. వాటిని దారి మళ్లించారు. ఈ మోసం చూసి అప్పులిచ్చిన బ్యాంకులు షాకయ్యాయి. బ్యాంకుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే దర్యాప్తు ఆపాలంటూ సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకున్నారు రఘురామ రాజు. దీంతో విచారణ కాస్త ఆలస్యం అయింది.
అయితే తాజాగా ఈ కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నాన్ మిసిలేనియస్ రోజుల్లో విచారణ జరపాలని కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో దర్యాప్తుపై స్టేను ఎత్తివేయాలని సీబీఐ కోర్టును కోరింది. ఒకవేళ ఈ దర్యాప్తు మొదలైతే రఘురామ అరెస్ట్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు.