మంత్రం వేస్తానని చెప్పి.. నీచమైన పని చేశాడు.. చివరికి?

praveen
నేటి రోజుల్లో ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఇక టెక్నాలజీకి అనుగుణంగానే మనిషి తన జీవనశైలిని కూడా మార్చుకుంటున్నాడు. ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి పనిని కూడా సులభతరం చేసుకుంటున్నాడు. ఇలాంటి ఆధునిక సమాజం లో ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మే జనాలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయి అనాగరికత వైపు అడుగులు వేస్తున్న మనుషులు అక్కడక్కడ తారస పడుతున్నారు.

 అయితే ఇలాంటి మనుషులని టార్గెట్గా చేసుకుంటున్న ఎంతోమంది బురిడీ బాబాలు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. కొంతమంది ఏకంగా అందిన కాడికి డబ్బులు దోచుకుంటుంటే ఇంకొంతమంది ఏకంగా మహిళల మానప్రాణాలను కూడా దోచుకుంటూ చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలాంటి ఘటనలపై అధికారులు ఎన్ని సార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన కొంతమంది జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. బురిడీ బాబా మాయలో పడి మరో మహిళ బలైంది.

 ఏకంగా ఆరోగ్యం బాగావ్వడానికి మంత్రాలు వేస్తాను అని చెప్పి ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఇక్కడ బురిడీ మంత్రగాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కిష్టాపూర్ లో ఒడిస్సా వాసి ఉంటున్నాడు. అయితే తన భార్య ఆరోగ్యం బాగాలేదని సహ ఉద్యోగి అయిన షేక్ మొహసిన్ కు చెప్పుకున్నాడు. అయితే తనకు మంత్రాలు వచ్చని.. మంత్రం వేసి నయం చేస్తానని నమ్మించి   అతని భార్యపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే అందరూ బయటే ఉండాలి మంత్రం వేస్తానని చెప్పి గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. అవమానంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: