వదినపై కోరిక పెంచుకున్న మరిది.. చివరికి ఓ రోజూ?

praveen
నేటి ఆధునిక సమాజంలో బంధాలకు బంధుత్వాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు మనిషి. ఈ క్రమంలోనే నీచమైన పనులు చేస్తూ ఉన్నాడు. క్షణకాల సుఖం కోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా సిద్ధమైపోతున్నాడు మనిషి. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు సాటి మనుషులకు సాయం చేయడానికి ముందుండే మనిషి ఇక ఇప్పుడు సొంత వారి విషయంలో కూడా కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బు నగలు ఆస్తుల కోసం ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారిని హత్యలు చేస్తున్న ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

 ఇక ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతూ ఉన్నాయి. ఇక మరికొన్ని ఘటనల్లో కొంతమంది కామాంధులు వావి వరుసలు మరిచి ఏకంగా కామంతో ఊగిపోతూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వదిన అంటే తల్లి తర్వాత తల్లి అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక కామాంధుడు మాత్రం వావి వరుసలను మరిచిపోయాడు.

 ఏకంగా వదిన పైన కామం పెంచుకున్న మరిది.. చివరికి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్ఘడ్ లో వెలుగులోకి వచ్చింది. వదినపై వ్యామోహంతో నూనెతో మసాజ్ పేరుతో సొంత అన్నని హతమార్చి అనారోగ్యంతో చనిపోయాడని జనాలను నమ్మించే ప్రయత్నం చేసి చివరికి పోలీసులకు దొరికిపోయాడు.  కుక్ దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే బంగరు గ్రామంలో పంచ్ సాయ్ పెద్ద కుమారుడు బిరుసురాం తన భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. అయితే పంచ్ సాయి చిన్న కుమారుడు భీమ్ సాయి తన అన్న భార్యపై కొంతకాలంగా కామం పెంచుకున్నాడు. విషయం అన్నకి తెలియడంతో తమ్ముడు పై సీరియస్ అయ్యాడు. అన్నపై కక్ష పెంచుకున్న తమ్ముడు బీమ్ సాయి నూనెతో మసాజ్ చేస్తానని అన్నకు మాయ మాటలు చెప్పి గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత అనారోగ్యంతో చనిపోయినట్లు నాటకం ఆడాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని తనదైన శైలిలో విచారణ చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: