మర్డర్ మిస్టరీ వీడింది.. అతన్ని చంపింది ఎవరో కాదు?
మొన్నటి వరకు కేవలం పరాయి వ్యక్తుల నుంచి మాత్రమే ప్రాణహాని ఉంది అని అందరూ నమ్మేవారు. కానీ నేటి రోజుల్లో ఏకంగా సొంతవారే దారుణంగా ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉండడంతో ఏ క్షణంలో ఎవరు దాడి చేసీ హత్య చేస్తారని భయపడిపోతున్నారు. అయితే ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే తూప్రాన్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో గత నెల 11వ తేదీన హాజీ పాషా అనే 44 వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఏకంగా ఆ సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక ఇటీవల ఈ మర్డర్ మిస్టరీ వీడింది అని చెప్పాలి. హత్య చేసింది ఎవరో కాదు భార్య సైదా బేగం, కూతురు మెహక్ బేగం, అల్లుడు పాషా అన్న విషయాన్ని తేల్చారు పోలీసులు. ఈ క్రమంలోనే వారిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ సీఐ కృష్ణ తెలిపారు. సైదా బేగం మొదటి భర్త కూతురైన మెహక్ బేగం ను వేధించడంతోనే ఇక ఇలా హాజీ పాషను హత్య చేసినట్లు నేరస్తులు అంగీకరించారు హత్య చేసిన అనంతరం దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీస్ విచారణలో అసలు నిజం బయటపడింది.