కేజీ వెల్లుల్లి రూ.500.. దొంగల భయంతో రైతు ఏం చేశాడో తెలుసా?
ఇలాంటి సమయంలో ఏకంగా టమాటా ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు టమాటా పంటకు సెక్యూరిటీ గార్డ్ లను రైతులు నియమించుకున్న ఘటనలు కూడా అందరిని ఆశ్చర్యపోయేలా చేసాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక రైతు ఇలాంటిదే చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇటీవల కాలంలో వెల్లుల్లి ధర ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా కేజీ 500 రూపాయలు పలుకుతుంది. ఈ క్రమంలోనే వెల్లుల్లి పంట వేసిన ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక రైతుల పంట పొలాల్లో వెల్లుల్లి చోరీ జరుగుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
అయితే తాను వేసిన వెల్లుల్లి పంటలో కూడా ఇలాంటి చోరీలు జరిగే అవకాశం ఉంది అని గ్రహించిన ఒక రైతు.. వినూత్నమైన ఆలోచన చేశాడు. పంటను కాపాడుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. మధ్యప్రదేశ్లోని మోహుకేడ్ ప్రాంతంలో పంట సాగు చేసిన రైతు.. పొలాల్లో ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగేలా.. వీటిని సెట్ చేశారు. అయితే ఇలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత వెల్లుల్లి దొంగతనాలు తగ్గిపోయాయి అని రైతులు చెబుతున్నారు.