భార్య ఇంస్టాగ్రామ్ వాడుతుందని.. భర్త ఏం చేశాడో తెలుసా.. అందరూ షాక్?

praveen
ఇటీవల కాలం లో సోషల్ మీడియా అనేది ప్రపంచ మలమూలలకు పాకి పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే జనాలు అందరూ కూడా ఇక సోషల్ మీడియా అనే మాయ లోనే మునిగి తేలుతూ ఉన్నారు. అయితే ఇక ఈ సోషల్ మీడియా లోనే అన్ని దొరుకుతూ ఉండడం తో బయట ప్రపంచం తో పని లేకుండా పోయింది. దీంతో పక్కన ఉన్న స్నేహితులతో మాట్లాడటం మానేసి ఎక్కడో దూరప్రాంతాల్లో ఉన్న స్నేహితులతో సోషల్ మీడియాలో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి.

 అదే కాదు ఈ సోషల్ మీడియాని తమ ఆదాయ వనరుగా మార్చుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా చాలామంది నేటి రోజుల్లో ఉన్నారు. కాగా సోషల్ మీడియా ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడటమే కాదు.. ఎన్నో అనర్థాలకు కూడా కారణమవుతుంది. మరి ముఖ్యంగా ఎన్నో పచ్చటి కాపురాలలో చిచ్చు పెడుతుంది.  ఎంతోమంది భార్యాభర్తలను విడగొట్టేస్తుంది. ఇలా సోషల్ మీడియా కారణంగా ఎంతో మంది భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి చివరికి విడాకులు తీసుకొని వేరుపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అని చెప్పాలి.

 ఇటీవల కాలంలో చాలాచోట్ల సోషల్ మీడియా అనేది పరిధి దాటి అలవాటు కాస్త వ్యసనంగా మారిపోతుంది. అయితే ఇక్కడ ఏకంగా సోషల్ మీడియా కారణంగా ఒక ప్రాణం పోయింది. తన భార్య ఇన్స్టాగ్రామ్ కు బానిసయింది అన్న కారణంతో కర్ణాటకలో కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా భార్య తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఆమె పెడచెవిన పెట్టడంతో అతను మనస్తాపం చెందాడు. ఇదే విషయంపై తరచూ ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలోనే మనస్థాపంతో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: