ప్రేమ పెళ్ళి.. యువతి అలా చేసిందని.. 3 రోజులకే వరుడు సూసైడ్?
అయితే ప్రేమించడం గొప్ప కాదు ఏకంగా ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లడం మాత్రం చాలా గొప్ప అని చెప్పాలి. అయితే ఏకంగా కొన్నెళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన జంట.. పెళ్లితో ఒకటైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇక్కడ ఓ జంట నాలుగేళ్ల పాటు ప్రేమించుకుంది. ఇక ఇటీవల పెళ్లి కూడా చేసుకుంది. కానీ వారి బంధంలో ఒక విషాదకర ఘటన జరిగింది. పెళ్లైన మూడు రోజులకే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని చిక్కమగలురు తాలూకాలో ఉన్న తెగురు గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
24 ఏళ్ల వినోద్ రాజ్ అనే యువకుడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. అతను నేషనల్ కబడ్డీ ప్లేయర్ కూడా. అయితే కబడ్డీనే ప్రాణంగా బ్రతుకుతున్న అతని జీవితంలోకి ప్రేమ వచ్చేసింది. 4 ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన తనుజ అని యువతిని ప్రేమించాడు. ఇక వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రేమకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఎన్నో రోజులకు పాటు పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండ పోయింది. ఈ క్రమంలోనే డిసెంబర్లో ఈ జంట పారిపోయి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మూడు రోజులకే తనుజ తాలిని వినోద్ రాజ్ కు ఇచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది. నాలుగేళ్లుగా ప్రేమించిన యువతి ఇలా మోసం చేసిందని తీవ్ర మనోవేదనకు గురై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు వినోద్. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.