గాలిపటం ఎగరవేశాడు.. చివరికి ప్రాణం పోయింది.. ఏమైందంటే?
ఇలా తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగగా భావించే సంక్రాంతిని ప్రతి ఒక్కరూ కూడా సంబరాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇటీవలే కాలంలో మాత్రం సంక్రాంతి పండుగ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపే పండుగ మారిపోయింది అని చెప్పాలి. దీనికంతటికి కారణం చైనా మంజా. చైనా మాంజా వాడొద్దని అధికారులు ఎంతలా అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జనాలు మాత్రం గాలిపటాలు ఎగరేసేందుకు చైనా మాంజా వాడుతున్నారు. చివరికి ఆ చైనా మంజ రోడ్డుపై వెళ్తున్న వాహనదారుల మెడకు చుట్టుకుని చివరికి యమపాశం గా మారి పోతుంది అని చెప్పాలి.
అదే చైనా మంజాతో ఎన్నో పక్షులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే కేవలం చైనా మాంజ మాత్రమే కాదు మరో విధం గా కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎత్తయిన బిల్డింగ్లపై గాలి పటాలు ఎగరవేయాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయం లోనే కొంతమంది ప్రాణాలను తెచ్చుకుంటారు. ఇటీవలే హైదరాబాద్లోనీ ఎల్బీ నగర్ పరిధి నాగోల్ లో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగరవేస్తూ నాలుగో అంతస్తు పై నుండి పడి శివ కుమార్ అనే బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించిన అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లి దండ్రులు శోకంలో మునిగి పోయారు.